RCB Franchise: ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత ఖరీదైన జట్టు అయిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB Franchise) త్వరలోనే అమ్ముడవ్వబోతోంది. ఈ జట్టు యజమాని అయిన డియాజియో (Diageo) ఇప్పటికే అమ్మకాల ప్రక్రియను ప్రారంభించింది. మార్చి 31, 2026 నాటికి ఈ అమ్మకం పూర్తి కావచ్చని భావిస్తున్నారు. ఈ విషయాన్ని డియాజియో సంస్థ స్వయంగా బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్కు తెలియజేసింది. ఐపీఎల్లో అత్యంత ప్రజాదరణ పొందిన జట్టు RCB కాబట్టి ఈ జట్టును ఎవరు కొనుగోలు చేయబోతున్నారనే దానిపై అందరి దృష్టి ఉంది. ప్రస్తుతం దీని బ్రాండ్ విలువ $269 మిలియన్ డాలర్లుగా ఉంది. ఈ జట్టు కొనుగోలుదారులలో అదానీ గ్రూప్ సహా మరికొందరు పెద్ద అభ్యర్థులు రంగంలోకి దిగుతున్నారు.
RCB కొత్త యజమాని ఎవరు కావచ్చు?
కొన్ని నెలల క్రితం వచ్చిన వార్తల ప్రకారం.. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత ఖరీదైన జట్టుగా అవతరించింది. నివేదికల ప్రకారం RCBని దాదాపు $2 బిలియన్ డాలర్లకు విక్రయించాలని డియాజియో భావిస్తోంది. క్రిక్బజ్ (Cricbuzz) ప్రకారం.. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరును కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతున్న ఐదు పెద్ద పేర్లను ఇప్పుడు తెలుసుకుందాం.
Also Read: MS Dhoni Retirement: ఐపీఎల్ నుంచి ధోని రిటైర్ అవుతున్నాడా?
5 ప్రధాన పోటీదారులు
- అదానీ గ్రూప్ (Adani Group)
- అదార్ పూనావాలా (Adar Poonawalla) – సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (Serum Institute of India)
- జేఎస్డబ్ల్యూ గ్రూప్ (JSW Group) – జిందాల్ (Jindal)
- దేవయాని ఇంటర్నేషనల్ గ్రూప్ (Devyani International Group) – రవి జైపురియా (Ravi Jaipuria)
- యూఎస్ (US) ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ కంపెనీ
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు IPL 2025 విజయం
ఐపీఎల్ చరిత్రలో అత్యంత ప్రజాదరణ పొందిన జట్టు అయినప్పటికీ RCB గత 17 ఏళ్లుగా ఒక్క టైటిల్ను కూడా గెలవలేదు. విరాట్ కోహ్లీ, డివిలియర్స్ వంటి అద్భుతమైన ఆటగాళ్లు ఉన్నప్పటికీ వారికి కప్ దక్కలేదు. అయితే ఐపీఎల్ 2025లో ఈ సుదీర్ఘ నిరీక్షణ ముగిసింది. రజత్ పాటిదార్ కెప్టెన్సీలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తమ మొదటి టైటిల్ను గెలుచుకుంది.
కానీ బెంగళూరులో జరిగిన వారి ట్రోఫీ వేడుక ఒక పీడకలలా మిగిలింది. ఆ సమయంలో జరిగిన తొక్కిసలాట (Stampede) కారణంగా 11 మంది ప్రాణాలు కోల్పోగా.. చాలా మంది గాయపడ్డారు. ఈ సంఘటన తర్వాతే RCBని విక్రయించే వార్తలు వెలువడుతున్నాయి. ఐపీఎల్ చరిత్రలో అత్యంత ఖరీదైన ఈ జట్టును ఎవరు కొనుగోలు చేస్తారో చూడాలి.
