Site icon HashtagU Telugu

Indian Test Players: ఈ ఏడాది టీమిండియాకు గుడ్‌బై చెప్పిన ఐదుగురు స్టార్ క్రికెటర్లు వీరే!

Indian Cricket

Indian Cricket

Indian Test Players: భారత క్రికెట్‌ అభిమానులను నిరాశపరిచే వార్త. ఈ ఏడాది ఐదుగురు స్టార్ క్రికెటర్లు (Indian Test Players) అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికారు. చాలా కాలంగా జట్టుకు దూరంగా ఉంటున్న టెస్ట్ స్పెషలిస్ట్ చతేశ్వర్ పుజారా ఎట్టకేలకు రిటైర్మెంట్ ప్రకటించాడు. ఆగస్టు 24, 2025న తన సోషల్ మీడియా ద్వారా ఈ విషయాన్ని వెల్లడించాడు. భారత టెస్ట్ క్రికెట్‌లో గొప్ప పేరున్న పుజారా 103 టెస్టుల్లో 7,195 పరుగులు చేశాడు. 2025లో రిటైర్ అయిన ఐదుగురు భారత క్రికెటర్లలో పుజారా ఒకడు.

ఈ ఏడాది రిటైర్ అయిన ఐదుగురు క్రికెటర్లు వీరే

Also Read: They Call Him OG: ఓజీ మూవీ నుంచి మ‌రో బిగ్ అప్డేట్‌.. ఈనెల 27న అంటూ ట్వీట్‌!

100కు పైగా టెస్టులు ఆడిన ఇద్దరు క్రికెటర్లు

ఈ ఏడాది టెస్టుల నుంచి రిటైర్ అయిన వారిలో కేవలం ఇద్దరు మాత్రమే 100కు పైగా టెస్ట్ మ్యాచ్‌లు ఆడారు. వారు విరాట్ కోహ్లీ, చతేశ్వర్ పుజారా ఉన్నారు. విరాట్ కోహ్లీ 123 టెస్టుల్లో 46.85 సగటుతో 9,230 పరుగులు సాధించాడు. ఇందులో 30 సెంచరీలు, 31 అర్ధ సెంచరీలు ఉన్నాయి. చతేశ్వర్ పుజారా 103 టెస్టుల్లో 43.60 సగటుతో 7,195 పరుగులు చేశాడు. అతని ఖాతాలో 19 సెంచరీలు, 35 అర్ధ సెంచరీలు ఉన్నాయి. రోహిత్ శర్మ (67 టెస్టులు), వరుణ్ ఆరోన్ (9 టెస్టులు), వృద్దిమాన్ సాహా (40 టెస్టులు) తమ కెరీర్‌కు ముగింపు పలికారు. ఈ ఐదుగురు ఆటగాళ్ల రిటైర్మెంట్‌తో భారత క్రికెట్‌లో ఒక శకం ముగిసినట్లయింది.

Exit mobile version