Site icon HashtagU Telugu

Chit-Fund Scam: కుంభకోణం కేసులో స్టార్ క్రికెటర్లు.. నలుగురికి సమన్లు!

Shubman Gill

Shubman Gill

Chit-Fund Scam: గుజరాత్ సీఐడీ బ్రాంచ్ భారతదేశంలోని న‌లుగురు ప్రముఖ క్రికెటర్లకు సమన్లు ​​పంపింది. రూ. 450 కోట్ల చిట్ ఫండ్ కుంభకోణంలో (Chit-Fund Scam) నలుగురు క్రికెట‌ర్లు శుభ్‌మన్ గిల్, రాహుల్ తెవాటియా, మోహిత్ శర్మ, సాయి సుదర్శన్ పేర్లు ఉన్నాయి. పెట్టుబడి మోసం సూత్రధారి భూపేంద్ర సింగ్ జాలాను దర్యాప్తు సంస్థలు విచారించగా ఈ విషయం వెలుగులోకి వచ్చింది.

గిల్ పెట్టుబడి పెట్టాడు

దర్యాప్తు అధికారుల ప్రకారం.. ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో గుజరాత్ టైటాన్స్‌కు కెప్టెన్‌గా వ్యవహరించిన శుభ్‌మన్ గిల్ ఈ పోంజీ/ఫ్రాడ్ పథకంలో రూ.1.95 కోట్లు పెట్టుబడి పెట్టాడు. అతను కాకుండా ఇతర ముగ్గురు క్రికెటర్లు అతని కంటే తక్కువ మొత్తంలో పెట్టుబడి పెట్టారు. భూపేంద్ర సింగ్ జాలా ఖాతాలను నిర్వహిస్తున్న రుసిక్ మెహతాను సీఐడీ అధికారులు అరెస్ట్ చేశారు.

Also Read: Indian Nurse : కేరళ నర్సుకు యెమన్‌లో మరణశిక్ష.. సాయం చేస్తామన్న ఇరాన్

దోషులుగా తేలితే చర్యలు తీసుకుంటామన్నారు

మీడియా కథనాల ప్రకారం.. ఈ కేసులో మెహతా దోషిగా తేలితే అతనిపై కఠిన చర్యలు తీసుకుంటారు. జాలా నిర్వహించే అనధికారిక ఖాతా పుస్తకాలు, లావాదేవీలను పరిశీలించే అకౌంటెంట్ల బృందాన్ని సిద్ధం చేసామన్నారు. అనధికారిక పుస్తకాన్ని సీఐడీ అధికారులు అదుపులోకి తీసుకుని సోమవారం నుంచి వివిధ చోట్ల నిరంతరం దాడులు నిర్వహిస్తున్నారు.

6 వేల కోట్ల మోసం

జలా రూ.6,000 కోట్ల మోసానికి పాల్పడినట్లు అధికారులు గతంలో వెల్లడించగా తర్వాత ఆ మొత్తాన్ని రూ.450 కోట్లకు తగ్గించారు. అధికారులు విడుదల చేసిన ఒక ప్రకటనలో.. “జలా అనధికారిక ఖాతా పుస్తకాన్ని నిర్వహిస్తున్నాడు. దానిని CID యూనిట్ స్వాధీనం చేసుకుంది. ఈ పుస్తకంలో రూ.52 కోట్ల లావాదేవీలు జరిగినట్లు గుర్తించారు. ఈ దర్యాప్తు ప్రకారం మొత్తం రూ. 450 కోట్లుగా అంచనా వేయబడింది. దాడులు కొనసాగుతున్నందున ఈ మొత్తం మరింత పెరిగే అవకాశం ఉందని తెలిపారు.