రాష్ట్రపతి ఎన్నికలకు ఉమ్మడి ప్రతిపక్షాల అభ్యర్థి యశ్వంత్ సిన్హా సోమవారం నామినేషన్ దాఖలు చేశారు. సిన్హా నామినేషన్ దాఖలుకు కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ, ఎన్సీపీ అధినేత శరద్ పవార్, సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్, నేషనల్ కాన్ఫరెన్స్ చీఫ్ ఫరూక్ అబ్దుల్లా, సీపీఎం నేత సీతారాం ఏచూరి, టీఆర్ఎస్ నుంచి మంత్రి కేటీఆర్, ఇతర ప్రతిపక్ష నేతలు హాజరయ్యారు. నామినేషన్ దాఖలు చేసేందు యశ్వంత్ సిన్హా మహాత్మా గాంధీ, డాక్టర్ బి.ఆర్లకు నివాళులర్పించారు. కాగా సిన్హాకు టీఆర్ఎస్ మద్దతు ప్రకటించింది. ఆ పార్టీ ప్రతినిధిగా మంత్రి కేటీఆర్ హాజరైయ్యారు.
రాష్ట్రపతి ఎన్నికల వ్యూహంపై చర్చించేందుకు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పిలిచిన సమావేశం నుంచి టీఆర్ఎస్ వైదొలిగిన కొద్ది రోజుల తర్వాత ఉమ్మడి ప్రతిపక్షాల అభ్యర్థిగా సిన్హాకు మద్దతు లభించింది. ఇప్పుడు సిన్హా కూడా ఎంపీలు, ఎమ్మెల్యేలను కలిసే ప్రచారాన్ని ప్రారంభించనున్నారు. శుక్రవారం సిన్హా ప్రధాని నరేంద్ర మోదీకి, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ కార్యాలయాలకు ఫోన్ చేసి ఎన్నికలకు మద్దతు ఇవ్వాలని కోరారు. ప్రతిపక్ష పార్టీల నేతలందరికీ లేఖ కూడా రాశారు. భారతదేశం చాలా కష్టతరమైన సమయాలను ఎదుర్కొంటోంది. నేను సామాన్య ప్రజల కోసం నా గొంతుకను పెంచుతాను. అంటూ సిన్హా లేఖలో పేర్కోన్నారు. బిజెపి నేతృత్వంలోని ఎన్డిఎ అభ్యర్థి ద్రౌపదై ముర్ము గత వారం ప్రధాని నరేంద్ర మోడీ, పార్టీ చీఫ్ జెపి నడ్డా, కేంద్ర మంత్రులు రాజ్నాథ్ సింగ్, అమిత్ షా, నితిన్ గడ్కరీ, కూటమి భాగస్వామ్య నేతల సమక్షంలో నామినేషన్ దాఖలు చేశారు. ముర్ము నామినేషన్ పత్రాల దాఖలు సమయంలో ఎన్డీయే పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరయ్యారు.