Yash: బాహుబలి రికార్డులన్నంటినీ బ్రేక్ చేయాల్సిందే..!

కేజీఎఫ్-2 ఏప్రిల్ 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రశాంత్ నీల్ ఈ మూవీని తెరకెక్కించారు. దీంతో ఈ మూవీపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలే ఉన్నాయి.

  • Written By:
  • Publish Date - April 11, 2022 / 04:40 PM IST

కేజీఎఫ్-2 ఏప్రిల్ 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రశాంత్ నీల్ ఈ మూవీని తెరకెక్కించారు. దీంతో ఈ మూవీపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలే ఉన్నాయి. శ్రీనిధిశెట్టి హీరోయిన్ గా సంజయ్ దత్, రవీనా టాండన్, కీలకపాత్రల్లో నటిస్తున్నారు. ఇక ఈ మూవీ కన్నడతోపాటు తెలుగు, తమిళ, మలయాళం, హిందీ భాషల్లో రిలీజ్ కానుండటంతో అన్ని భాషల్లోనూ ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు చిత్రయూనిట్. ప్రమోషన్ లో భాగంగా రెండు రోజులపాటు తెలుగు రాష్ట్రాల్లో సందడి చేయాలని టీం ప్లాన్ చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ మేరకు ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మూవీ టీం…ప్రెస్ టీంను ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమంలో మూవీ టీం మొత్తం కూడా పాల్గొన్నది. అయితే ఈ ప్రెస్ మీట్ లో అనూహ్య ప్రశ్న ఎదురైంది. కేజీఎఫ్-2 బాహుబలి కలెక్షన్లను బ్రేక్ చేస్తుందా అనే ప్రశ్న టీంకు ఎదురైంది.

ఈ ప్రశ్నకు యష్ స్పందించారు. ఏదైనా ఒక మూవీ వస్తే…అంతకు ముందున్న రికార్డులు అన్నింటినీ బ్రేక్ చేయాలని…దాన్నే ప్రొగ్రెస్ అంటారన్నాడు. ఏదో ఒక రికార్డు క్రియేట్ అయ్యిందంటే…దాన్ని పట్టుకుని కూర్చోవద్దని చెప్పాడు. కలెక్షన్ల పరంగా ఎప్పటికప్పుడు మారుతుంటాయి. కానీ ప్రేక్షకుల ప్రేమ ఎంతుందనేది ఎప్పుడు అతిముఖ్యమైన అంశం అవుతుందన్నాడు. ఆ దేవుడు ఏం నిర్ణయిస్తే…అదే జరుగుతుందని చెప్పుకొచ్చారు యష్.

ఇక ఓవర్సిస్ సెన్సార్ బోర్డు అభ్యర్థి అయిన ఉమైర్ సంధు…ఈ మధ్య కాలంలో సౌత్ మూవీస్ పై ఎక్కువగా దృష్టి పెట్టారు. తాను సినిమాలకు సెన్సార్ సర్టిఫికెట్ ఇవ్వడంతోపాటు రివ్యూలను కూడా ఇస్తూ…ప్రేక్షకుల్లో ఆసక్తిని అంచనాలను పెంచుతున్నారు. ఇప్పటివరకు ఉమైర్ ఇచ్చిన రివ్యూలు దాదాపు సక్సెస్ అయ్యాయి. ఇప్పుడు కేజీఎఫ్ 2 కూడా రివ్యూ ఇచ్చాడు. మొత్తంగా కేజీఎఫ్ 2 యాక్షన్ థ్రిల్లర్ మూవీ అని చెప్పాడు.