తెలంగాణలో గణేష్ నిమజ్జనం సందర్భంగా శుక్రవారం, శనివారం మద్యం షాపులు ముతపడనున్నాయి. హైదరాబాద్, సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని వైన్ షాపులు మూసివేయాలని ఎక్సైజ్ శాఖ ఆదేశాలు జారీ చేసింది. ఈ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించింది. ఇక వరుసగా 2 రోజులు వైన్ షాపులు మూసివేయనుండటంతో ముందుబాబులు అలర్ట్ అయ్యారు. ముందుగానే మద్యం తీసుకునేందుకు వైన్ షాపుల ముందుబారులు తీరారు.