Onion Prices: పెరిగిన ఉల్లి ధరలతో బెంబేలెత్తుతున్న వినియోగదారులు..!

పండుగల సీజన్‌లో ఉల్లి ధర (Onion Prices) పెరగడంతో సామాన్యులు ఇబ్బందులు పడుతున్నారు. దీపావళికి ముందు ఉల్లి ధరలు 57 శాతానికి పైగా పెరిగాయి.

Published By: HashtagU Telugu Desk
Onions Benefits

Onions Benefits

Onion Prices: పండుగల సీజన్‌లో ఉల్లి ధర (Onion Prices) పెరగడంతో సామాన్యులు ఇబ్బందులు పడుతున్నారు. దీపావళికి ముందు ఉల్లి ధరలు 57 శాతానికి పైగా పెరిగాయి. పీటీఐ వార్తల ప్రకారం.. రిటైల్ మార్కెట్‌లో ఉల్లి ధర కిలో రూ.47 (ఉల్లిగడ్డ రిటైల్ ధర)కు చేరుకుంది. ఇలాంటి పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం కూడా ధరల నియంత్రణకు సిద్ధమైంది.

ప్రభుత్వం ‘బఫర్ స్టాక్’ విక్రయిస్తుంది

ఉల్లి ధరలను నియంత్రించేందుకు మోదీ ప్రభుత్వం పెద్ద ఎత్తున్న ఉల్లి బఫర్ స్టాక్‌ను వినియోగదారులకు కిలో రూ.25 చొప్పున విక్రయించాలని ఆదేశించింది. వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ విడుదల చేసిన గణాంకాల ప్రకారం.. గతేడాది ఈ సమయంలో రిటైల్ మార్కెట్‌లో కిలో ఉల్లిని రూ.30 చొప్పున విక్రయించారు. ప్రస్తుతం రిటైల్ మార్కెట్‌లో కిలో ఉల్లి ధర రూ.40కి చేరింది.

Also Read: 6 Signs You Are Not A Couple : ఇలా కలిసి ఉన్నా మీరు వేరుగా ఉన్నట్టే..!

మార్కెట్‌లో ‘బఫర్ స్టాక్’ విక్రయిస్తున్నారు

వినియోగదారుల వ్యవహారాల కార్యదర్శి రోహిత్ కుమార్ సింగ్ పిటిఐతో మాట్లాడుతూ.. మార్కెట్లో ఉల్లి ధరలను నియంత్రించడానికి, ఉల్లి బఫర్ స్టాక్‌ను ఆగస్టు 2023 నుండి మార్కెట్‌లో విడుదల చేస్తున్నట్లు తెలిపారు. మార్కెట్‌లో ఉల్లి తగినన్ని అందుబాటులో ఉండేలా, ధర అదుపులో ఉండేలా ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఆగస్టు 2023 నుండి ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం 22 రాష్ట్రాల్లో మొత్తం 1.70 లక్షల టన్నుల ఉల్లిపాయ బఫర్ స్టాక్‌ను విక్రయించింది. ఉల్లి బఫర్ స్టాక్‌ను నేషనల్ అగ్రికల్చరల్ కోఆపరేటివ్ మార్కెటింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (NAFED), నేషనల్ కన్స్యూమర్ కోఆపరేటివ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (NCCF) ద్వారా కేంద్ర ప్రభుత్వం పంపిణీ చేస్తోందని గమనించాలి.

We’re now on WhatsApp. Click to Join.

నిపుణుల అభిప్రాయం ప్రకారం ఉల్లి ధరలు పెరగడం వెనుక అనేక కారణాలు ఉన్నాయి. ఖరీఫ్‌లో నాట్లు ఆలస్యం కావడమే ఇందుకు ప్రధాన కారణం. పంటలు వేయడంలో జాప్యం కారణంగా పంట దిగుబడి ఆలస్యమవుతోంది. దీని ప్రభావం టోకు, రిటైల్ ఉల్లి ధరలపై కనిపిస్తోంది. వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ గణాంకాల ప్రకారం.. 2023-24 ఆర్థిక సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం NAFED, NCCFలలో మొత్తం 5 లక్షల టన్నుల ఉల్లిపాయ బఫర్ స్టాక్‌ను మార్కెట్‌లో విక్రయించబోతోంది. ఇది కాకుండా అదనంగా 2 లక్షల టన్నుల ఉల్లిని విక్రయించాలని ప్రభుత్వం యోచిస్తోంది.

  Last Updated: 28 Oct 2023, 01:33 PM IST