Manne Krishank: రాష్ట్ర ప్రభుత్వం అక్రమాలపై కోర్టుకు వెళ్తాం: మన్నె క్రిశాంక్

  • Written By:
  • Updated On - June 28, 2024 / 08:27 PM IST

Manne Krishank: సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు డిల్లీ చుట్టూ చక్కర్లు కొడుతున్నారని బిఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ మన్నె క్రిశాంక్ మండిపడ్డారు. రేవంత్ రెడ్డి క్యాబినెట్ లో మంత్రులు డమ్మీలుగా మారారని, హోంమంత్రి పర్మిషన్ లేకుండానే హైదరాబాద్ నగరంలో షాపులపై ఆంక్షలు పెడతారని, ఆబ్కారీ మంత్రి జూపల్లి కృష్ణారావుకు తెలియకుండానే రాష్ట్రంలో సోం డిస్టీలరీస్ కు అనుమతి ఇచ్చారని ఆరోపించారు.

పొన్నం ప్రభాకర్ కు తెలియకుండానే ఆర్టీసీలో ఈ టిక్కెట్ మిషన్లు కొనుగోలు చేశారని మంత్రి అంటున్నారు. రాష్ట్రంలో తుగ్లక్ పాలన నడుస్తోందని, టెండర్లు లేకుండా కోట్ల రూపాయల కాంట్రాక్టును కంపెనీలకు అప్పగిస్తున్నారని ఫైర్ అయ్యారు. ఆర్టీసీ ఈ టిక్కెట్ కాంట్రాక్టు విషయంపై సమాచారం అడిగితే మా పరిధిలోకి రాదని ఎండీ సమాధానం చెప్తున్నారని, ఆర్టీసీ ఈ టిక్కెట్ మిషన్ల కాంట్రాక్టుపై పొన్నం ప్రభాకర్ కు సంబంధం లేదని అంటున్నారని మన్నె పేర్కొన్నారు. ప్రతి రోజు 30 నుంచి 50 లక్షల టిక్కెట్ల కమీషన్
కంపెనీకి వెళ్తుందని, కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో ఫేక్ ప్రభుత్వం నడుపుతోందని, రాష్ట్ర ప్రభుత్వం అక్రమాలపై కోర్టుకు వెళ్తామని క్రిశాంక్ ఛాలెంజ్ చేశారు.