PM Modi: ఢిల్లీ యూనివర్శిటీ (DU)లోని 3 భవనాలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (PM Modi) నేడు అంటే శుక్రవారం శంకుస్థాపన చేయనున్నారు. దీంతో పాటు ‘కాఫీ టేబుల్’ పుస్తకాలను కూడా విడుదల చేయనున్నారు. ఈ సందర్భంగా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు కూడా చేశారు. ఇందుకోసం ప్రధాని మోదీ ఢిల్లీ మెట్రోలో యూనివర్సిటీకి బయలుదేరారు. ఈ సమయంలో ప్రధాని మోదీ ఇతర ప్రయాణికులతో కూడా సంభాషించడం కనిపించింది. ఉపాధ్యాయులు, సిబ్బంది, విద్యార్థులందరికీ ప్రత్యేక కార్డుల ద్వారా ప్రవేశం తప్పనిసరి చేయబడింది. ముఖ్యంగా టెక్నికల్ బిల్డింగ్, కంప్యూటర్ సెంటర్ మరియు అకడమిక్ బ్లాక్లకు ప్రధాని శంకుస్థాపన చేస్తారు. ఢిల్లీ మెట్రోలో ప్రయాణించిన తర్వాత ప్రధాని మోదీ ఢిల్లీ యూనివర్సిటీకి బయలుదేరారు. అక్కడ పలు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు.
జూన్ 30న ఢిల్లీ యూనివర్సిటీ (డియు) శతాబ్ది ఉత్సవాల ముగింపు కార్యక్రమానికి ప్రధాన మంత్రి ముఖ్య అతిథిగా హాజరవుతారని డియు వైస్ ఛాన్సలర్ యోగేష్ సింగ్ తెలిపారు. ప్రధాని మోదీ చేయనున్న 3 కొత్త భవనాల శంకుస్థాపన కార్యక్రమానికి కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కూడా ‘గౌరవ అతిథి’గా హాజరుకానున్నారు. లోగో బుక్తో సహా 3 కాఫీ టేబుల్ పుస్తకాలను కూడా ప్రధాని విడుదల చేస్తారని డీయూ సౌత్ క్యాంపస్ డైరెక్టర్ ప్రకాశ్ సింగ్ తెలిపారు.
#WATCH | Prime Minister Narendra Modi interacts with people in Delhi Metro on his way to attend the centenary celebrations of Delhi University. pic.twitter.com/BGmewjqTP2
— ANI (@ANI) June 30, 2023
ప్రధాన మంత్రి శంకుస్థాపన చేయనున్న మూడు భవనాలలో కంప్యూటర్ సెంటర్ మరియు ఫ్యాకల్టీ ఆఫ్ టెక్నాలజీ (నార్త్ క్యాంపస్), మారిస్ నగర్లో నిర్మించనున్న అకడమిక్ బ్లాక్ ఉన్నాయి. రానున్న రెండేళ్లలో ఈ భవనాల నిర్మాణ పనులు పూర్తవుతాయి. ఢిల్లీ యూనివర్సిటీ శతాబ్ది ఉత్సవాల్లో ప్రధాని పాల్గొంటున్న సందర్భంగా విద్యార్థులందరికీ హాజరును తప్పనిసరి చేశారు. ఢిల్లీ విశ్వవిద్యాలయం మే 1,1922న స్థాపించబడింది. గత 100 సంవత్సరాలలో విశ్వవిద్యాలయం విపరీతంగా అభివృద్ధి చెందింది. విస్తరించింది. ఇప్పుడు దీనికి 86 విభాగాలు, 90 కళాశాలలు, 6 లక్షలకు పైగా విద్యార్థులు ఉన్నారు.