ఏపీ బీజేపీలో వర్గపోరు చాపకిందనీరులా విస్తరిస్తుంది. ప్రస్తుత పార్టీ అధ్యక్షుడిగా ఉన్న సోము వీర్రాజుకు వ్యతిరేకేంగా విజయవాడలోని ఓ హోటల్లో కీలక నేతలు సమావేశంమైయ్యారు. జాతీయ కార్మిక సంక్షేమ బోర్డ్ చైర్మన్ జయప్రకాష్ నారాయణ అద్వర్యంలో పార్టీ జాతీయ కార్యదర్శి వై సత్యకూమార్ కు ఆత్మీయసమావేశం పేరుతో ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశారు.ఈ సమావేశానికి బీజేపీ నేతలు కన్నా లక్ష్మీనారాయణ, లంకా దినకర్, తురగా నాగభూషణం, జమ్ముల శ్యామ్ కిషోర్, కిలారు దిలిప్ పాతూరి నాగభూషణం, మాజీ MLA విష్ణు కుమార్ రాజు, మాజీ మంత్రి ఆదినారయణ రెడ్డి, రమేష్ నాయుడు, SK బాజీ శ్రీనివాసరాజు, ఇతర ముఖ్య నేతలు హాజరైయ్యారు.సమావేశంలో ఏపీ బీజేపీ అధ్యక్షుడి పేరు ప్రస్తవన లేకుండా జరిగింది.
ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో విజయానికి తన వంతు కృషిచేసిన సత్యకుమార్ ను ఏపీ రాజకీయాలపై దృష్టి పెట్టాలని బీజేపీ నేతలు కోరినట్లు సమాచారం. త్వరలో అద్యక్ష పదవి మార్పు ఉంటుందని సోము వీర్రాజు వ్యతిరేక వర్గం బావిస్తుంది. ఈ సమావేశంలో అధ్యక్ష పదవి కోసం పోటి పడుతున్న నేతలు సత్యకుమార్ ను పోగడ్తలతో ముంచేత్తారు. బీజేపీ చీఫ్, ఇతర నేతలు అధికార వైసీపీ పార్టీపై ఎలాంటి విమర్శలు చేయడంలేదు. అయితే దీనిపై ఆ పార్టీ భిన్నస్వరాలు వినిపిస్తుంది. అధికార పార్టీపై పోరాడితే బీజేపీ బలపడిందని కొంతమంది నేతలు భావిస్తున్నారు. కానీ అది ఎక్కడా ఆచరణలో లేదు. అందుకే ఆయన్ని తప్పించేందకు కొంతమంది నేతలు ఈ సమావేశం నిర్వహించినట్లు సమాచారం.