ప్రముఖ సంగీత దర్శకుడు ఎమ్ఎమ్ కీరవాణి (MM Keeravani) ఇంట తీవ్ర విషాదం నెలకొంది. బుధవారం(డిసెంబర్ 14న ఆయన తల్లి మృతి చెందారు. అనారోగ్యంతో బాధపడుతున్న ఆమెను మూడు రోజుల క్రితం కుటుంబ సభ్యులు కిమ్స్ ఆస్పత్రిలో చెర్పించారు. ఈ క్రమంలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆమె ఆరోగ్యం క్షీణించడంతో నేడు తుదిశ్వాస విడిచారు. ఆమె భౌతికకాయాన్ని ప్రముఖ డైరెక్టర్ రాజమౌళి (Rajamouli) నివాసానికి తరలించనున్నారు. ఆమె మృతితో కీరవాణి ఇంట విషాదచాయలు అలుముకున్నాయి. తల్లి మృతితో తీవ్ర దు:ఖంలో మునిగిపోయారు కీరవాణి. టాలీవుడ్ సినీ ప్రముఖులు, నటీనటులు ఆమె మృతికి సంతాపం తెలుపుతున్నారు.
Also Read: Ukraine – Russia : ఉక్రెయిన్ రాజధానిలో పేలుళ్లు..13 డ్రోన్ల కూల్చివేత