Rahul Gandhi: రాహుల్ గాంధీపై పరువు నష్టం కేసు, విచారణ ఫిబ్రవరి 20కి వాయిదా

కేంద్ర మంత్రి అమిత్‌ షాపై కాంగ్రెస్‌ అధినేత రాహుల్‌ గాంధీ అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన కేసులో విచారణను ఫిబ్రవరి 20కి వాయిదా వేస్తున్నట్లు ఎంపీ-ఎమ్మెల్యే కోర్టు తెలిపింది.

Published By: HashtagU Telugu Desk
Rahul Gandhi

Rahul Gandhi

Rahul Gandhi: కేంద్ర మంత్రి అమిత్‌ షాపై కాంగ్రెస్‌ అధినేత రాహుల్‌ గాంధీ అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన కేసులో విచారణను ఫిబ్రవరి 20కి వాయిదా వేస్తున్నట్లు ఎంపీ-ఎమ్మెల్యే కోర్టు తెలిపింది. ప్రాసిక్యూషన్ లాయర్ సంతోష్ కుమార్ పాండే మాట్లాడుతూ రాహుల్ గాంధీ గురువారం కోర్టుకు హాజరుకావాల్సి ఉందని, అయితే ప్రస్తుతం ఆయన భారత్ జోడో న్యాయ్ యాత్రలో ఉన్నారని ఆయన న్యాయవాది కాశీ ప్రసాద్ శుక్లా కోర్టుకు తెలిపారు.

న్యాయవాది శుక్లా తన క్లయింట్ రాహుల్ గాంధీ కోర్టుకు హాజరు కావడానికి ఫిబ్రవరి 15 మరియు 25 మధ్య తేదీ ఇవ్వాలని కోర్టును అభ్యర్థించారు. దీంతో ఈ కేసులో తదుపరి విచారణను ఫిబ్రవరి 20వ తేదీగా కోర్టు ఖరారు చేసింది. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా మే 8న బెంగళూరులో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రాహుల్ గాంధీ అప్పటి బీజేపీ చీఫ్ అమిత్ షాపై ఆరోపణలు చేశారని ఆరోపిస్తూ రాహుల్ గాంధీపై స్థానిక బీజేపీ నేత విజయ్ మిశ్రా పరువు నష్టం కేసు వేశారు.

Also Read: Vijay Devarakonda : కల్కిలో రౌడీ హీరో ఇంకా ఆ స్టార్ కూడా.. నాగ్ అశ్విన్ మెగా ప్లాన్ అదుర్స్..!

  Last Updated: 18 Jan 2024, 11:44 PM IST