CM Yogi Adityanath: ట్విట్టర్ కింగ్ యోగి ఆదిత్యనాథ్

ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ భారత రాజకీయాల్లో అత్యంత ప్రజాదరణ పొందిన వ్యక్తులలో ఒకరని రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధి తెలిపారు.

Published By: HashtagU Telugu Desk
UP Police Constable

Yogi Adityanath

CM Yogi Adityanath: ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ భారత రాజకీయాల్లో అత్యంత ప్రజాదరణ పొందిన వ్యక్తులలో ఒకరని రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధి తెలిపారు.

ట్వీట్ బైండర్ తాజా నివేదిక ప్రకారం అక్టోబర్‌లో ప్రధాని నరేంద్ర మోడీ తర్వాత ట్విట్టర్ ఎక్స్ ద్వారా ఎక్కువ మంది దృష్టిని ఆకర్షించిన రాజకీయ నాయకుడు యోగి ఆదిత్యనాథ్. అక్టోబర్ 1 నుండి 31 వరకు భారతదేశంలో ఎక్స్ పై వినియోగదారులు చేసిన పోస్ట్‌ల సంఖ్యను విశ్లేషించడం ద్వారా ట్వీట్ బైండర్ తన నివేదికను బయటపెట్టింది. ట్వీట్ బైండర్ నివేదిక ప్రకారం ప్రధాని మోడీ సోషల్ మీడియా ఖాతా ఎక్స్ పై అత్యధిక స్థాయిలో చర్చ జరిగింది. ఆ తర్వాత అత్యంత ఎక్కువగా మాట్లాడే రాజకీయ నాయకుడిగా యోగి ఆదిత్యనాథ్ రెండో స్థానంలో నిలిచారని నివేదిక స్పష్టం చేసినట్టు ఆ రాష్ట్ర అధికార ప్రతినిధి తెలిపారు. యోగి కంటే ప్రధాని మోడీ, భారత క్రికెటర్ విరాట్ కోహ్లీ మరియు దక్షిణాది నటుడు విజయ్ మాత్రమే ముందున్నారు. యోగి ఆదిత్యనాథ్‌కి ఎక్స్‌లో 2.65 కోట్ల మంది ఫాలోవర్లు ఉన్నారు.

Also Read: School Bus Accident : ఏపీలో మరో బస్సు ప్రమాదం ..

  Last Updated: 06 Nov 2023, 01:03 PM IST