హైదరాబాద్లోని నెహ్రూ జూలాజికల్ పార్క్లో ఉంచిన అనేక సింహాల ఆరోగ్యం విషమంగా ఉందని ఓ సందర్శకుడు తెలిపాడు. దీంతో తెలంగాణ ప్రభుత్వం సెప్టెంబర్ 19, సోమవారం నాడు, జూలో ఉన్న 20 సింహాలలో రెండు అనారోగ్యంతో ఉన్నాయని తెలిపింది. ఆరిహంత్ ఆర్యన్ అనే వ్యక్తి సోమవారం జంతుప్రదర్శనశాలను సందర్శించిన తర్వాత “నెహ్రూ పార్క్లోని సింహాలు చాలా అనారోగ్యంతో ఉన్నాయని నేను గ్రహించాను. నా స్నేహితులు చాలా మంది సందేహించారు కూడా. నా అభిప్రాయాలను నిరూపించడానికి నా దగ్గర ఆధారాలు లేవు’’ అని రియాక్ట్ అయ్యాడు.
ఈ విషయాన్ని తెలంగాణ ఐటీ & పరిశ్రమల శాఖ మంత్రి కెటి రామారావును ట్యాగ్ చేశారు. ట్వీట్పై కేటీఆర్ స్పందిస్తూ.. ఘటనాస్థలికి చేరుకుని జంతువులను పరీక్షించాల్సిందిగా వెటర్నరీ వైద్యులను ఆదేశించినట్లు తెలిపారు. “మేం NZP వైద్యులతో సింహాలను పరీక్షిస్తాము. దీన్ని నా దృష్టికి తీసుకువచ్చినందుకు ధన్యవాదాలు. ” రెండు సింహాలు అస్వస్థతకు గురయ్యాయని, మిగిలిన 18 ఆరోగ్యంగా ఉన్నాయని తెలంగాణ ప్రభుత్వం స్పష్టం చేసింది. అస్వస్థతకు గురైన సింహాలకు వెటర్నరీ నిపుణుల నుంచి చికిత్స అందిస్తున్నామని ప్రభుత్వం తెలిపింది.
ఈ జూలో 8 ఆఫ్రికన్, 12 ఆసియాటిక్ జాతి సింహాలున్నాయి. ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ (ఫారెస్ట్ ఫోర్స్ హెడ్) RM డోబ్రియాల్ మాట్లాడుతూ, చికిత్స పొందుతున్న రెండు సింహాలు మినహా అన్ని సింహాలు ఆరోగ్యంగా ఉన్నాయని చెప్పారు. అలాగే జూలో జంతువుల సంరక్షణకు ఇద్దరు వెటర్నరీ డాక్టర్లు ఉన్నారని తెలిపారు.
@KTRTRS Sir, there are 20 lions @nehruzoopark1 (8 African and 12 Asiatic), all are healthy, except 2 lions undergoing treatment. There are 2 veterinary Drs taking care of animals in the zoo. All arrangements are in place to take care of sick animals.@TelanganaCMO @IKReddyAllola https://t.co/oRvcxW6XZu
— R. M. Dobriyal , IFS (@dobriyalrm) September 19, 2022