Twitter Vs Government : కొన్ని ట్వీట్లు, కొన్ని ట్విట్టర్ అకౌంట్స్ ను తొలగించాలన్న కేంద్ర ప్రభుత్వం ఆదేశాలను సవాలు చేస్తూ సోషల్ మీడియా దిగ్గజం ట్విట్టర్ వేసిన పిటిషన్ను కర్ణాటక హైకోర్టు శుక్రవారం కొట్టేసింది. ట్విట్టర్ వైఖరిని తప్పుపడుతూ రూ. 50 లక్షల జరిమానా కూడా విధించింది. కేంద్ర ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖ జారీ చేసిన ఆర్డర్స్ పై స్టే విధించాలన్న ట్విట్టర్ అభ్యర్థనను కోర్టు తిరస్కరించింది.
కొన్ని ట్వీట్లు, కొన్ని ట్విట్టర్ అకౌంట్స్ ను తొలగించాలంటూ కేంద్ర సర్కారు జారీ చేసిన ఆర్డర్స్ ఏకపక్షంగా, వాక్ స్వాతంత్ర్యానికి, భావ ప్రకటన స్వేచ్ఛలకు విఘాతం కలిగించేలా ఉన్నాయంటూ 2022 జూలైలో ట్విట్టర్ వేసిన పిటిషన్ ను విచారించిన కర్ణాటక హైకోర్టు ఈమేరకు తీర్పును వినిపించింది. ట్విట్టర్ విదేశీ సంస్థ కావడంతో ప్రాథమిక హక్కుల అమలును క్లెయిమ్ చేసుకోలేదని ఈ కేసులో కేంద్రం(Twitter Vs Government) తెలిపింది. అయితే ఆర్టికల్ 14 ప్రకారం విదేశీ సంస్థలకు కూడా హక్కులు అందుబాటులో ఉన్నాయని కోర్టులో ట్విట్టర్ వాదించింది. ఐటీ చట్టంలోని సెక్షన్ 69A కింద సూచించిన ప్రొటోకాల్లను కేంద్ర సర్కారు ఉల్లంఘిస్తోందని ఆరోపించింది.
Also read : Asteroid Attack Earth : పచ్చటి అడవిని ఆస్టరాయిడ్ బూడిద కుప్పగా మార్చిన వేళ..
ఈ కేసులో ఎన్నో మలుపులు..