Site icon HashtagU Telugu

Rgv Tweet On Draupadi: ద్రౌపదిపై ‘ఆర్జీవీ’ రాజకీయం!

Rgv

Rgv

ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ముపై చేసిన ట్వీట్‌పై దర్శకుడు రామ్ గోపాల్ వర్మ (ఆర్‌జీవీ)పై తెలంగాణ బీజేపీ నేతలు గూడూరు నారాయణ రెడ్డి, టి.నందీశ్వర్ గౌడ్ శుక్రవారం అబిడ్స్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. నారాయణరెడ్డి విలేకరులతో మాట్లాడుతూ.. షెడ్యూల్డ్ తెగ (ఎస్టీ)కి చెందిన మహిళకు భారత రాష్ట్రపతిని చేసేందుకు ప్రధాని నరేంద్ర మోదీ అవకాశం కల్పించారన్నారు. “ఆమె స్వతంత్ర భారతదేశానికి మొదటి ST ప్రెసిడెంట్ అవ్వబోతున్నారు” అన్నారు. తన ట్వీట్‌తో ద్రౌపదిని అపహాస్యం చేసినందుకు RGVని కఠినంగా శిక్షించాలని కోరాడు. ఆ ట్వీట్‌ను బీజేపీ నేతలు ఫిర్యాదుతో పాటు పోలీసులకు సాక్ష్యంగా సమర్పించారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద పోలీసులు కేసు నమోదు చేయాలని డిమాండ్‌ చేశారు.

అంతకుముందు రాంగోపాల్ వర్మ పరోక్షంగా ద్రౌపది ముర్ముపై వ్యంగ్యంగా కామెంట్స్ చేశారు. ‘‘ద్రౌపది రాష్ట్రపతి అయితే పాండవులు ఎవరు? మరి ముఖ్యంగా కౌరవులు అంటే ఎవరు?’’ అంటూ ట్వీట్ చేశారు. వర్మ ట్వీట్ చేసిన నిమిషాల్లోనే వైరల్ గా మారి వివాదానికి దారి తీసింది. అయితే కొందరు వర్మకు మద్దతు ఇస్తే, మరికొందరు వ్యతిరేకిస్తున్నారు. ఆర్జీవీ చిక్కుల్లో పడటం ఇదే తొలిసారి కాదు. గతంలో ఆయన అనుచిత వ్యాఖ్యలు చేసి విమర్శలు ఎదుర్కొన్నారు. తన వ్యాఖ్యలతో వివాదాలు సృష్టిస్తూ మీడియా దృష్టిని ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నాడు. కాగా వర్మ వ్యాఖ్యలపై బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు స్పందించారు. రాష్ట్రపతి అభ్యర్థిపై వర్మ చవకబారు వ్యాఖ్యలు చేయడం మానుకోవాలని హెచ్చరించారు. ప్రజల మనోభావాలకు సంబంధించిన విషయం అని, లక్ష్మణరేఖ దాటొద్దని స్పష్టం చేశారు. మరోపక్క, తన వ్యాఖ్యల పట్ల వివాదం చెలరేగడంతో వర్మ ట్విట్టర్ లో స్పందించారు. తాను ఎలాంటి దురుద్దేశంతోనూ ఆ వ్యాఖ్యలు చేయలేదని వివరణ ఇచ్చారు.

Exit mobile version