యాదగిరిగుట్టకు వెళ్లే మినీ బస్సు సర్వీసులను బుధవారం ఉప్పల్ బస్టాప్లో టీఎస్ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్, వీసీఅండ్ ఎండీ వీసీ సజ్జనార్ జెండా ఊపి ప్రారంభించారు. వివిధ ప్రాంతాల నుంచి మినీ బస్సులతో యాత్రికులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా నేరుగా యాదాద్రికి చేరుకోవడానికి టిఎస్ఆర్టిసి సౌకర్యాలు కల్పిస్తోందని చైర్మన్ బాజిరెడ్డి గోవర్థన్ రెడ్డి తెలిపారు.
హైదరాబాద్ నుంచే కాకుండా వివిధ జిల్లాల నుంచి కూడా ఈ సేవలు అందుబాటులో ఉన్నాయని టీఎస్ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తెలిపారు. జేబీఎస్, ఉప్పల్, భువనగిరి, యాదగిరిగుట్ట ప్రాంతాల నుంచి యాదాద్రి దర్శిని మినీ బస్సులు భక్తులకు సేవలు అందిస్తున్నాయని తెలిపారు. యాత్రికులకు ఆధ్యాత్మిక అనుభూతిని పెంపొందించడానికి, బస్సులలో భక్తి పాటలను ప్లే చేసే సౌకర్యం కూడా ఉంది. భవిష్యత్తులో డిమాండ్ను బట్టి బస్సుల సంఖ్యను పెంచుతామని, బాసర, వేములవాడ, కాళేశ్వరం, భద్రాచలం తదితర ప్రాంతాల నుంచి యాదగిరిగుట్టకు సర్వీసులను అనుసంధానం చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.