కోఠి – కొండాపూర్ మధ్య ‘లేడీస్ స్పెషల్’ బస్సును ఆగస్టు 21 నుంచి ప్రారంభించనున్నట్లు తెలంగాణ రోడ్డు రవాణా సంస్థ ప్రకటించింది. ఈ విషయాన్ని ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ ట్విట్టర్లో తెలిపారు. మహిళా ప్రయాణికులు ఈ సేవను ఉపయోగించుకుని సురక్షితంగా తమ గమ్యస్థానాలకు చేరుకోవాలని ఆయన కోరారు. బస్సు నెం. 127కె కోఠి నుంచి ఉదయం 8.50 గం.లకి ప్రారంభమై లక్డీకాపూల్, మాసాబ్ ట్యాంక్, ఎమ్మెల్యే కాలనీ, ఉషాకిరణ్, బేగంపేట, కొత్తగూడ ఎక్స్ రోడ్ల మీదుగా కొండాపూర్ చేరుకుంటుందని ఆయన ట్విట్టర్లో తెలిపారు. సాయంత్రం 5.45 గంటలకు అదే మార్గంలో కోఠికి బస్సు తిరిగి వస్తుందని తెలిపారు.. మహిళా ప్రయాణికులు ఈ సేవను వినియోగించుకుని సురక్షితంగా తమ గమ్యస్థానాలకు చేరుకోవాలని టీఎస్ ఆర్టీసీ తెలిపింది.
మహిళా ప్రయాణికులకు శుభవార్త. కోఠి-కొండాపూర్ మార్గంలో లేడీస్ స్పెషల్ బస్సును #TSRTC ఏర్పాటు చేసింది. 127K నంబర్ ప్రత్యేక బస్సు ఈ నెల 21 (సోమవారం) నుంచి ప్రారంభం కానుంది. ప్రతి రోజు ఉదయం 8.50 గంటలకు కోఠి నుంచి బయలుదేరుతుంది. లక్దికాపుల్, మసబ్ ట్యాంక్, ఎమ్మెల్యే కాలనీ, ఉషా కిరణ్,… pic.twitter.com/EhpJg85VUb
— VC Sajjanar – MD TGSRTC (@tgsrtcmdoffice) August 18, 2023