Site icon HashtagU Telugu

Restrictions on NY celebrations: తెలంగాణాలో న్యూ ఈయర్ వేడుకలపై ఆంక్షలు

new year

new year

తెలంగాణాలో పెరుగుతున్న ఓమైక్రాన్ కేసుల నేపధ్యంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణలో న్యూ ఇయర్‌ వేడుకలపై ప్రభుత్వం ఆంక్షలు విధించింది.
హైకోర్టు ఆదేశాల మేరకు తెలంగాణ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

డిసెంబర్ 31 నుండి జనవరి 2 వరకు ర్యాలీలు, బహిరంగసభలను ప్రభుత్వం నిషేధించింది. పబ్లిక్ ఈవెంట్స్‌లో భౌతికదూరం తప్పనిసరి చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. మాస్క్ పెట్టుకోకపోతే కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించింది. శనివారం నుండే ఆంక్షలు అమలులోకి వస్తాయని అధికారులు తెలిపారు.

ఈ మేరకు రాష్ట్రంలోని అన్ని జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసింది. ఒమైక్రాన్ దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, స్వీయ రక్షణ పాటించాలని ప్రభుత్వం పేర్కొంది.

Exit mobile version