అమెరికా తెలుగు సంఘం (ఆటా) 17వ మహాసభల్లో పాల్గొనేందుకు టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అమెరికా చేరుకున్నారు.
ఎమ్మెల్సీ కవితకు వాషింగ్టన్ విమానాశ్రయంలో ఎమ్మెల్యే గువ్వల బాల్రాజ్, టీఆర్ఎస్ ఎన్నారై విభాగం అధ్యక్షుడు మహేశ్ బిగాల, టీఆర్ఎస్ పార్టీ సంయుక్త విభాగం నాయకులు గువ్వల బాల్రాజ్ ఘన స్వాగతం పలికారు.
ATA మహాసభలు – యూత్ కన్వెన్షన్ వాషింగ్టన్ DC, USA లో జూలై 1-3 వరకు జరుగుతాయి
ఆటా మహాసభల్లో తెలంగాణ పెవిలియన్ను ఆవిష్కరించనున్న ఎమ్మెల్సీ కవిత అదే రోజు సాయంత్రం ఆటా ప్రైమ్ మీట్లో పాల్గొని ఆటా బతుకమ్మపై ప్రచురించిన ప్రత్యేక సంచికను ఆవిష్కరించనున్నారు.