Andhra Pradesh : ఏపీలో వెయ్యి కోట్ల రూపాయ‌లు పెట్టుబ‌డి పెట్ట‌నున్న త్రివేణి గ్లాస్‌

త్రివేణి గ్లాస్ లిమిటెడ్ ఎండీ వరుణ్ గుప్తా సీఎం జ‌గ‌న్‌మోహ‌న్ రెడ్డిని క‌లిశారు. తూర్పుగోదావరి జిల్లా పంగిడిలో 840 మెట్రిక్‌

Published By: HashtagU Telugu Desk
CM JAGAN

CM JAGAN

త్రివేణి గ్లాస్ లిమిటెడ్ ఎండీ వరుణ్ గుప్తా సీఎం జ‌గ‌న్‌మోహ‌న్ రెడ్డిని క‌లిశారు. తూర్పుగోదావరి జిల్లా పంగిడిలో 840 మెట్రిక్‌ టన్నుల రోజువారీ ఉత్పత్తి సామర్థ్యంతో రూ.1,000 కోట్లతో సోలార్‌ గ్లాస్‌ తయారీ యూనిట్‌ను తమ కంపెనీ ఏర్పాటు చేస్తున్నట్లు ముఖ్యమంత్రికి వివరించారు. ఇది ప్రత్యక్షంగా, పరోక్షంగా 2,000 మందికి ఉపాధిని కల్పిస్తుంది. జిల్లాలో అవసరమైన అన్ని మౌలిక సదుపాయాలు, శిక్షణ పొందిన వ్యక్తులు అందుబాటులో ఉన్నారని ముఖ్యమంత్రి ఆయనకు పూర్తి సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు. వనరులను సద్వినియోగం చేసుకోవాలని పారిశ్రామికవేత్తలను కోరారు. ముఖ్యమంత్రి ప్రత్యేక ప్రధాన కార్యదర్శి డాక్టర్ పూనం మాలకొండయ్య, ప్రభుత్వ సలహాదారు ఎస్ రాజీవ్ కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

  Last Updated: 28 Feb 2023, 07:42 AM IST