Delhi Train Accident: ఢిల్లీలో ప‌ట్టాలు త‌ప్పిన గూడ్స్ రైలు..

ఈ రోజు శనివారం ఢిల్లీలోని జకీరాలో గూడ్స్ రైలుకు చెందిన పది వ్యాగన్లు పట్టాలు తప్పాయి. ఈ ఘటన చార మండిలోని జకీరా ఫ్లైఓవర్ సమీపంలో జరిగింది. ఉదయం 11.50 నిముషాలకు ఈ ప్రమాదం

Delhi Train Accident: ఇటీవల కాలంలో దేశంలో వరుస రైలు ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ వరుస రైలు ప్రమాదాలు కలకలం సృష్టిస్తున్నాయి. ఒడిశాలో మూడు రైళ్ల ప్రమాదం మరవకముందే మరికొన్ని సంఘటన చోటుచేసుకుంటున్నాయి. తాజాగా ఢిల్లీలో ఓ గూడ్స్ రైలు ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో 10 బోగీలు పట్టాలు తప్పాయి.

ఈ రోజు శనివారం ఢిల్లీలోని జకీరాలో గూడ్స్ రైలుకు చెందిన పది వ్యాగన్లు పట్టాలు తప్పాయి. ఈ ఘటన చార మండిలోని జకీరా ఫ్లైఓవర్ సమీపంలో జరిగింది. ఉదయం 11.50 నిముషాలకు ఈ ప్రమాదం జరిగిందని రైల్వే అధికారులు ప్రాధమిక సమాచారం అందించారు. కాగా ఈ ప్రమాద ఘటనపై సమాచారం అందుకున్న రైల్వే అధికారుల బృందం, అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకున్నారు. స్థానిక వివరాల ప్రకారం..ముంబై నుంచి చండీఘ‌డ్ వెళ్తున్న ఆ గూడ్స్ రైలులో ఐర‌న్ షీట్ రోల్స్ ఉన్నాయి. అయితే ఈ ఘటనలో ప్రాణనష్టం జరిగే అవకాశాలు లేవని రైల్వేశాఖ తెలిపింది.మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

Also Read: LS Elections : బాపట్ల కాంగ్రెస్‌ అభ్యర్థిగా జేడీ శీలం..!