Train Derailment: సబర్మతి ఎక్స్‌ప్రెస్ ప్ర‌మాదానికి కార‌ణ‌మిదేనా..?

వారణాసి నుండి అహ్మదాబాద్ వెళ్తున్న రైలు నంబర్ 19168 సబర్మతి ఎక్స్‌ప్రెస్ పట్టాలు తప్పింది. కాన్పూర్‌కు 11 కిలోమీటర్ల దూరంలో భీమ్‌సేన్-గోవింద్‌పురి స్టేషన్‌ల మధ్య ఈ ప్రమాదం జరిగింది.

Published By: HashtagU Telugu Desk
Train Derailment

Train Derailment

Train Derailment: ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో ఈరోజు తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో జరిగిన రైలు ప్రమాదానికి కారణం (Train Derailment) వెలుగులోకి వచ్చింది. ప్రమాదం గురించి అధికారులు సమాచారం ఇస్తూ.. రైలు పట్టాలు తప్పిన కారణాన్ని లోకో పైలట్ వివరించారు. కాన్పూర్ సిటీ ఏడీఎం రాకేష్ వర్మ కూడా ప్రమాదంపై స్టేట్ మెంట్ ఇచ్చారు. రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ప్రకటన కూడా వెలుగులోకి వచ్చింది. బండరాయిని ఢీకొనడమే ప్రమాదానికి కారణమని చెబుతున్నారు. ట్రాక్‌పై ఏదో ఉంచారని, దీని కారణంగా రైలు భారీగా ఢీకొని ఇంజిన్‌తో పాటు పట్టాలు తప్పిందని కూడా చెబుతున్నారు. దాదాపు 25 బోగీలు పట్టాలు తప్పడంతో ప్రయాణికులు భ‌యాందోళ‌న చెందారు. ప్రయాణికులెవరూ మృతి చెందకపోవడం గుడ్ న్యూస్‌. కొంతమంది ప్రయాణికులకు గాయాలు కాగా, ప్రమాదం జరిగిన ప్రదేశంలోనే వారికి ప్రథమ చికిత్స అందించారు.

లోకో పైలట్‌, రైల్వే మంత్రి చెప్పిన కార‌ణ‌మిదే..?

మీడియా కథనాల ప్రకారం.. వారణాసి నుండి అహ్మదాబాద్ వెళ్తున్న రైలు నంబర్ 19168 సబర్మతి ఎక్స్‌ప్రెస్ పట్టాలు తప్పింది. కాన్పూర్‌కు 11 కిలోమీటర్ల దూరంలో భీమ్‌సేన్-గోవింద్‌పురి స్టేషన్‌ల మధ్య ఈ ప్రమాదం జరిగింది. రైలు బండరాయిని ఢీకొట్టడమే ప్రమాదానికి కారణమని ఉత్తర మధ్య రైల్వే, లోకో పైలట్ తెలిపారు. బండరాయిని ఢీకొట్టడంతో ఇంజన్ బ్యాలెన్స్ తప్పి రైలు మొత్తం పట్టాలు తప్పింది.

Also Read: Monthly Interest Income : ప్రతినెలా వడ్డీ ఆదాయం కావాలా ? ఇవిగో టాప్ సేవింగ్స్ స్కీమ్స్

రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ కూడా సబర్మతి ఎక్స్‌ప్రెస్ ఇంజిన్‌ను ట్రాక్‌పై ఉంచిన వస్తువును ఢీకొట్టిందని, రైలు మొత్తం పట్టాలు తప్పిందని ట్వీట్ చేశారు. రైలు ఇంజన్‌పై తీవ్రంగా దెబ్బతిన్న గుర్తులు కనిపించాయి. బండరాళ్లతో ఢీకొన్న ఆధారాలు ఉన్నాయి. ఐబీ, ఉత్తరప్రదేశ్ పోలీసులు మోహరించారు. ప్రయాణికులు, సిబ్బందికి ఎలాంటి గాయాలు కాలేదు. రైలు పట్టాలు తప్పడానికి ముందు ప్రయాణికులు ఢీకొన్న శబ్దం విన్నారని డీఆర్‌ఎం దీపక్ సింగ్ తెలిపారు. ప్రమాదంపై సమగ్ర విచారణ జరుపుతామన్నారు.

హెల్ప్‌లైన్ నంబర్ విడుదల, ప‌లు రైళ్లు రద్దు

ప్రమాదం గురించి సమాచారం ఇస్తూ కాన్పూర్ సిటీ ADM రాకేష్ వర్మ మాట్లాడుతూ.. ప్రమాదం గురించి తెలిసిన వెంటనే చాలా రైళ్ల రూట్‌లను మార్చడం, చాలా రైళ్లను కూడా రద్దు చేసినట్లు తెలిపారు. కాన్పూర్ నుంచి బుందేల్ ఖండ్, మధ్యప్రదేశ్ వెళ్లే రైళ్లను రద్దు చేశారు. దాదాపు 25 బోగీలు పట్టాలు తప్పాయి. అయితే ప్రయాణికులెవరూ గాయపడలేదు. ప్రయాణికులందరినీ బస్సుల్లో రైల్వే స్టేషన్‌కు తరలించారు. మెమో రైలును కూడా పిలిచారు. ప్రాథమిక విచారణలో ట్రాక్‌కు నష్టం జరిగినట్లు ఎలాంటి ఆధారాలు లభించలేదు. అయితే 16వ కోచ్‌కు సమీపంలో రైలు తాళం పగులగొట్టి కనిపించింది.

We’re now on WhatsApp. Click to Join.

  Last Updated: 17 Aug 2024, 09:25 AM IST