Site icon HashtagU Telugu

TPCC: సీఎం కేసీఆర్ పై రేవంత్ రెడ్డి ఫిర్యాదు!

Revanth reddy

భారత రాజ్యాంగంపై సీఎం కేసీఆర్ వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడున్న భారత రాజ్యాంగంతో  గడిచిన 75 సంత్సరాలల్లో ప్రజల ఆశయాలు , ఆకాంక్షలు నెరవేరడం లేదని సీఎం అభిప్రాయపడ్డారు. కేసీఆర్ వ్యాఖ్యల పట్ల టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన  శనివారం గజ్వేల్ పోలీస్ స్టేషన్ కు వెళ్లి కంప్లైంట్ చేశారు. కేసీఆర్ పై దేశద్రోహం కేసు నమోదు చేయాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. పోలీస్ స్టేషన్ లో సీఐ వీరప్రసాద్  కు భారత రాజ్యాంగం పుస్తకాన్ని అందించారు.

Exit mobile version