భారత రాజ్యాంగంపై సీఎం కేసీఆర్ వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడున్న భారత రాజ్యాంగంతో గడిచిన 75 సంత్సరాలల్లో ప్రజల ఆశయాలు , ఆకాంక్షలు నెరవేరడం లేదని సీఎం అభిప్రాయపడ్డారు. కేసీఆర్ వ్యాఖ్యల పట్ల టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన శనివారం గజ్వేల్ పోలీస్ స్టేషన్ కు వెళ్లి కంప్లైంట్ చేశారు. కేసీఆర్ పై దేశద్రోహం కేసు నమోదు చేయాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. పోలీస్ స్టేషన్ లో సీఐ వీరప్రసాద్ కు భారత రాజ్యాంగం పుస్తకాన్ని అందించారు.
TPCC: సీఎం కేసీఆర్ పై రేవంత్ రెడ్డి ఫిర్యాదు!
