దేశంలో బంగారం ధరలు (Gold, Silver Price Today) మళ్లీ భగ్గుమన్నాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ. 550 పెరగగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ. 500 పెరిగింది. మార్కెట్లో 22 క్యారెట్లకు చెందిన 10 గ్రాముల బంగారం రేటు రూ.53,000కు ఎగబాకింది. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.57,820కు చేరింది. విశాఖపట్నం, విజయవాడల్లోనూ ఇవే ధరలు ఉన్నాయి. కిలో వెండి ధర ఒక్కసారిగా రూ.1000 పెరిగి రూ.73,300కు ఎగబాకింది. హైదరాబాద్లో కిలో వెండి ధర రూ.76,000 మార్కుకు చేరింది.
తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు గురువారం పై విధంగా ఉన్నాయి. ధరలలో మార్పులు చోటు చేసుకునేందుకు అనేక కారణాలున్నాయంటున్నారు బులియన్ మార్కెట్ నిపుణులు. అంతర్జాతీయ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, ద్రవ్యోల్బణం, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వాటి వడ్డీ రేట్లు, కరోనా, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి తదితర కారణాలు పసిడి రేట్లపై అధిక ప్రభావం చూపే అవకాశం ఉందని బులియన్ మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. ఇక గురువారం (ఫిబ్రవరి 2, 2023) దేశీయంగా బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. ఇక దేశంలోని ప్రధాన నగరాల్లో నేటి ధరల వివరాలివే..!
బంగారం ధరలు
దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.53,150 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.57,980గా ఉంది. ఇక చెన్నైలో 22 క్యారెట్ల పసిడి ధర రూ.54,150 కాగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.59,070గా ఉంది. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.53,000 వద్ద కొనసాగుతుండగా, 24 క్యారెట్ల ధర రూ.57,820 వద్ద ఉంది. కోల్కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.53,000 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.57,820గా ఉంది. బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.53,050 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.57,870గా ఉంది.
ఇకపోతే.. హైదరాబాద్లో 22 క్యారెట్లకు చెందిన 10 గ్రాముల బంగారం ధర రూ.53,000 వద్ద కొనసాగుతోంది. ఇటు 24 క్యారెట్లకు చెందిన 10 గ్రాముల బంగారం ధర రూ.57,820గా నమోదైంది. విజయవాడలో కూడా 22 క్యారెట్లకు చెందిన 10 గ్రాముల బంగారం ధర స్థిరంగా రూ.53,000 వద్ద ఉంది. 24 క్యారెట్లకు చెందిన 10 గ్రాముల బంగారం ధర రూ.57,820గా ఉంది.
Also Read: Twitter Payments: త్వరలోనే ట్విట్టర్ లో డిజిటల్ పేమెంట్స్.. ఎప్పటి నుంచో తెలుసా?
వెండి ధరలు
ఢిల్లీలో కిలో వెండి ధర రూ. 73,300 ఉండగా, ముంబైలో రూ.73,300గా ఉంది. ఇక చెన్నైలో కిలో వెండి ధర రూ.76,000 ఉండగా, కోల్కతాలో రూ.73,300గా ఉంది. బెంగళూరులో కిలో వెండి ధర రూ.76,000 ఉండగా, కేరళలో రూ.76,000గా ఉంది. హైదరాబాద్లో కిలో వెండి ధర రూ.76,000 ఉండగా, విజయవాడలో రూ.76,000 వద్ద కొనసాగుతోంది. విశాఖపట్నంలో కూడా ఇదే ధర కొనసాగుతోంది.