Kashmir: కశ్మీర్​లో​ ముగ్గురు ఉగ్రవాదులు హతం

  • Written By:
  • Updated On - December 31, 2021 / 11:52 AM IST

జమ్ముకశ్మీర్​లో భద్రతా బలగాలకు, ఉగ్రవాదులకు మధ్య బుధవారం తెల్లవారుజామున ఎదురుకాల్పులు జరిగాయి. శ్రీనగర్​లోని పంథా చౌక్‌​ ప్రాంతంలో జరిగిన ఈ ఘటనలో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. ఈ కాల్పుల్లో నలుగురు సీఆర్​పీఎఫ్​ జవాన్లు గాయపడ్డారని కశ్మీర్ జోన్ పోలీసులు తెలిపారు. వారి నుంచి భారీగా ఆయుధాలు, మందుగుండు సామాగ్రిని స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు.

చనిపోయిన వారిలో ఒకరిని సుహేల్​ అహ్మద్​గా పోలీసులు గుర్తించారు. అతనికి జైషే మహ్మద్​తో సంబంధాలు ఉన్నట్లు పోలీసులు పేర్కొన్నారు.పంథా చౌక్‌ ప్రాంతంలో ఉగ్రవాదులు నక్కి ఉన్నారనే సమాచారాన్ని అందుకున్న పోలీసులు సెర్చ్ ఆపరేషన్ నిర్వాహించారు. ఈ క్రమంలోనే ముష్కరులు భద్రతాదళాలపై ఎదురు కాల్పులు జరిపారు. దీంతో కాశ్మీర్​ పోలీసులు, సీఆర్​పీఎఫ్​ సిబ్బంది ఉమ్మడిగా చేపట్టిని ఈ ఎన్​కౌంటర్​లో ముగ్గురు పోలీసులు, మరో సీఆర్​పీఎఫ్​ జవాన్​కు గాయాలైనట్లు వివరించారు. వీరిని స్థానికంగా ఉండే ఆసుపత్రికి తరలించినట్లు స్పష్టం చేశారు.