Hyderabad : విహార‌యాత్ర‌లో విషాదం..సెల్ఫీ దిగుతూ నీటిలో ప‌డి ముగ్గురు మృతి

హైదరాబాద్ పాతబస్తీలోని యాకుత్‌పురాలో విషాదం నెల‌కొంది. విహార‌యాత్ర‌కు వెళ్లిన ముగ్గురు నీటిలో ప‌డి మృతి

Published By: HashtagU Telugu Desk
Death Representative Pti

Death Representative Pti

హైదరాబాద్ పాతబస్తీలోని యాకుత్‌పురాలో విషాదం నెల‌కొంది. విహార‌యాత్ర‌కు వెళ్లిన ముగ్గురు నీటిలో ప‌డి మృతి చెందారు.సిద్దిపేట జిల్లా వర్గల్‌ మండలం నెంటూరు ట్యాంక్‌ వద్దకు విహారయాత్రకు వెళ్లిన ఓ చిన్నారి స‌హా మ‌రో ఇద్ద‌రు సెల్ఫీ దిగుతూ నీటిలో మునిగి మృతి చెందారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్ నగరంలోని యాకుత్‌పురాకు చెందిన షేక్‌ ఖైసర్‌(26), మేనల్లుడు షేక్‌ ముస్తఫా(03), బంధువు మహ్మద్‌ సోహైల్‌(17)లు తమ కుటుంబ సభ్యులతో కలిసి ఓ కార్యక్రమానికి హాజరయ్యేందుకు మాసాన్‌పల్లి మక్తాకు వచ్చారు. వారు నెంటూరు సమీపంలోని ట్యాంక్ వద్దకు వెళ్లారు, అక్కడ ఖైసర్ తన మొబైల్ ఫోన్‌ను ఉపయోగించి సెల్ఫీ తీసుకోవడానికి ముస్తఫాను తీసుకుని ముందుకు వెళ్లాడు. ఆ స‌మ‌యంలో ఇద్దరూ నీటిలోకి జారిపోవడంతో, సోహైల్ వారిని రక్షించేందుకు ప్రయత్నించాడు. దీంతో ముగ్గురు నీటిలో మునిగిపోయారని పోలీసులు తెలిపారు.

  Last Updated: 05 May 2023, 06:26 AM IST