Odisha Train Accident: ఈ సమయంలో రాజకీయాలు తగదు.. మమతా బెనర్జీపై రైల్వే మంత్రి ఫైర్

ఒడిశాలోని బాలాసోర్‌లో రైలు ప్రమాద స్థలాన్ని సందర్శించిన అనంతరం పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కేంద్ర ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. శనివారం ప్రమాద స్థలాన్ని సందర్శించిన ఆమె

Odisha Train Accident: ఒడిశాలోని బాలాసోర్‌లో రైలు ప్రమాద స్థలాన్ని సందర్శించిన అనంతరం పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కేంద్ర ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. శనివారం ప్రమాద స్థలాన్ని సందర్శించిన ఆమె .. ఇదే అతిపెద్ద రైలు ప్రమాదమని, ఈ రైలులో యాంటీ ఆక్సిడెంట్ పరికరం లేదని, అది ఉంటే ఈ ప్రమాదం జరిగేదని కాదని ఆమె అభిప్రాయపడ్డారు. ఈ రైలు ప్రమాదానికి సంబంధించి రైల్వే మంత్రి పదవికి రాజీనామా చేయాలని మమతా బెనర్జీ అశ్విని వైష్ణవ్‌ను డిమాండ్ చేశారు. ఈ విషయంపై రైల్వే మంత్రి మాట్లాడుతూ ఈ సమయంలో మా దృష్టి అంతా క్షతగాత్రుల ప్రాణాలను కాపాడటంపైనే ఉంది. అంతే కాకుండా రెస్క్యూ పనులను వీలైనంత త్వరగా పూర్తి చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఈ సయమంలో రాజకీయాలు చేయడం తగదు అంటూ సీఎం మమతా బెనర్జీ వ్యాఖ్యలను తప్పుబట్టారు. కాగా ఈ ప్రమాదానికి సంబంధించిన సమాచారాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు మాతో (కేంద్ర ప్రభుత్వం) పంచుకుంటోందని మంత్రి అన్నారు.

మరోవైపు ఈ ప్రమాదంలో మరణించిన బెంగాల్ రాష్ట్ర ప్రజల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.5 లక్షలు ఇస్తామని మమతా బెనర్జీ తెలిపారు. సహాయ, సహాయ చర్యల్లో రాష్ట్ర ప్రభుత్వానికి, రైల్వేకు పూర్తి సహకారం అందిస్తామని చెప్పారు. నిన్న 40, ఈరోజు 70 అంబులెన్స్‌లు ప్రమాద స్థలానికి పంపినట్టు ఆమె పేర్కొన్నారు. కాగా భారతీయ రైల్వే లెక్కల ప్రకారం ఈ ప్రమాదంలో ఇప్పటివరకు 288 మంది మరణించారు.

Read More: Artificial Intelligence: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రమాదంపై బ్రిటన్