America: ఎన్ఆర్ఐలకు గుడ్ న్యూస్ చెప్పిన అపెడా.. ఏకంగా అన్ని నెలలకు సరిపడా బియ్యం నిల్వలు?

గత వారం రోజులుగా ఎన్ఆర్ఐలు బియ్యం కోసం నానా కష్టాలు పడుతున్న విషయం మనందరికీ తెలిసిందే. విదేశాలలో ఉన్న భారతీయులకు బియ్యం నిల్వలు తక్కువగా ఉ

  • Written By:
  • Publish Date - July 25, 2023 / 03:30 PM IST

గత వారం రోజులుగా ఎన్ఆర్ఐలు బియ్యం కోసం నానా కష్టాలు పడుతున్న విషయం మనందరికీ తెలిసిందే. విదేశాలలో ఉన్న భారతీయులకు బియ్యం నిల్వలు తక్కువగా ఉన్నాయి అని తెలియడంతో సమీపంలోని స్టోర్ లకు క్యూ తీరారు. కొన్ని ప్రదేశాలలో అవకాశం దొరికింది కదా అనిబియ్యంపై భారీగా ధరలు పెంచేశారు. అయితే భారతీయులు ఇతర దేశాలతో పోల్చుకుంటే ఎక్కువ శాతం మంది అమెరికాలో ఉంటున్న సంగతి మనందరికీ తెలిసిందే. అమెరికాలో భారతీయులు లక్షల్లో ఉన్నారు అనడంలో ఎటువంటి సందేహం లేదు. వారు అమెరికాలో ఉన్నప్పటికీ బియ్యం వాడకంను కొనసాగిస్తారు.

అయితే ఈ మధ్య కేంద్ర ప్రభుత్వం నాన్‌- బాసుమతి బియ్యం ఎగుమతిపై నిషేధం విధించడంతో అగ్రరాజ్యమైన అమెరికాతో పాటు ఇతర దేశాల్లోని భారతీయులకు బియ్యం పంపిణీ చేయడం కష్టంగా మారనుంది. కానీ అమెరికాలో బియ్యం కొరత లేదంట. అమెరికాలో ఆరు నెలలకు సరిపడా బియ్యం నిల్వలు ఉన్నాయని తాజాగా వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతుల అభివృద్ధి సంస్థ(అపెడా) ప్రకటించింది. బియ్యం ఎగుమతులపై ఇండియా నిషేధం విధించినా అమెరికాలో ఆరు నెలలకు సరిపడా బియ్యం నిల్వలు ఉన్నాయని అపెడా ప్రకటించడంతో అమెరికాలోని భారతీయులు ఊపిరి పీల్చుకున్నారు.

అపెడా చక్కటి శుభవార్తను తెలపడంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కాగా
ప్రస్తుతం అమెరికాలో దాదాపు 12వేల మెట్రిక్‌ టన్నుల బియ్యం నిల్వలు ఉన్నాయని అపెడా ప్రకటించింది. నిషేధానికి ముందే మరో 18 వేల మెట్రిక్‌ టన్నుల బియ్యం సరఫరా అయిందని సంస్థ ప్రతినిధులు తెలిపారు. అమెరికా ప్రతి నెలా 6వేల టన్నుల నాన్‌ బాసుమతి బియ్యాన్ని భారత్‌ నుంచి దిగుమతి చేసుకుంటోందని ఇందులోనూ తెలంగాణ, ఏపీ నుంచి ఆయా రాష్టరాల వాటా 4 వేల టన్నులని వివరించారు. బియ్యం ఎగుమతుల నిషేధంతో అమెరికాలో 9.7 కేజీల బియ్యం బస్తా ధర రూ.18 డాలర్ల నుంచి 50 డాలర్లకు పెరిగిందని అన్నారు. అమెరికాలోని భారతీయులు సోనామసూరి బియ్యం ఎక్కువగా వినియోగిస్తారని వాటిపై ఉన్న నిషేధాన్ని వెంటనే ఉపసంహారించుకోవాలని కేంద్ర ప్రభుత్వానికి అపెడా విజ్ఞప్తి చేసింది.