Terrorists Fire: ఆర్మీ వాహనంపై ఉగ్రదాడి.. 5 రౌండ్ల కాల్పులు!

జమ్మూకశ్మీర్‌లోని రాజౌరీలో ఆర్మీ వాహనంపై కాల్పులు జరిగాయి. ప్రమాదవశాత్తు కాల్పులు జరిగినట్లు ప్రాథమిక విచారణలో తేలింది. ఆర్మీ వాహనం తరలిస్తున్న సమయంలో ఈ ఘటన జరిగింది.

Published By: HashtagU Telugu Desk
Terrorists Fire

Terrorists Fire

Terrorists Fire: జమ్మూకశ్మీర్‌లోని రాజౌరీలో బుధవారం ఆర్మీ వాహనంపై ఉగ్రదాడి (Terrorists Fire) జరిగింది. ఉగ్రవాదులు ఆర్మీ వాహ‌నంపై కాల్పులు జరిపారు. ప్రస్తుతం ఎలాంటి ప్రాణనష్టం జరిగినట్లు సమాచారం లేదు. సమాచారం ప్రకారం సుందర్‌బని ప్రాంతంలో ఈ దాడి జరిగింది. ప్రాథమిక సమాచారం ప్రకారం.. ఆర్మీ వాహనంపై ఉగ్రవాదులు 5 రౌండ్లు కాల్పులు జరిపారు. దాడి జరిగిన సమయంలో ఆర్మీ వాహనం పెట్రోలింగ్‌లో ఉంది. సుందర్‌బని ప్రాంతం పాకిస్థాన్ సరిహద్దుకు ఆనుకుని ఉంది. కాల్పులను సైన్యం ఇంకా ధృవీకరించలేదు. ప్రస్తుతం అక్కడికి పోలీసులను అనుమతించడం లేదు. సైన్యం సెర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తోంది.

జమ్మూకశ్మీర్‌లోని రాజౌరీలో ఆర్మీ వాహనంపై కాల్పులు జరిగాయి. ప్రమాదవశాత్తు కాల్పులు జరిగినట్లు ప్రాథమిక విచారణలో తేలింది. ఆర్మీ వాహనం తరలిస్తున్న సమయంలో ఈ ఘటన జరిగింది. అయితే దీనిపై ఇంకా ఏ ఆర్మీ అధికారి నుంచి ఎలాంటి ప్రకటన రాలేదు. రౌజారీలోని సుందర్‌బని సెక్టార్‌లో ఆర్మీ వాహనంపై మధ్యాహ్నం 12.45 గంటల సమయంలో 4 నుంచి 5 రౌండ్ల కాల్పులు జరిగాయని అంతకుముందు వర్గాలు తెలిపాయి. ఈ ఘటనకు పాల్పడిన వెంటనే ఉగ్రవాదులు అక్కడి నుంచి పరారైన‌ట్లు స‌మాచారం. ఈ ఘటనలో ఎలాంటి గాయాలు, ప్రాణనష్టం జరిగినట్లు సమాచారం లేదు. ఆ ప్రాంతంలో సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించి ఉగ్రవాదుల కోసం గాలిస్తున్నారు.

Also Read: MLC Vote : ‘ఎమ్మెల్సీ’ ఓటు వేయబోతున్నారా ? ఇవి తప్పకుండా తెలుసుకోండి

అంతకుముందు ఫిబ్రవరి 7న పాకిస్థాన్ నుంచి చొరబడిన ఏడుగురు చొరబాటుదారులను భారత సైన్యం హతమార్చింది. ఈ ఘటన పూంచ్ జిల్లాలోని కృష్ణాలోయ సమీపంలో ఫిబ్రవరి 4వ తేదీ రాత్రి జరిగింది. LOC సమీపంలో చొరబాటు జరిగినప్పుడు ఈ కాల్పులు జ‌రిపారు.

మూలాధారాలను విశ్వసిస్తే.. ఉగ్రవాదులు భారత సైన్యం ఫార్వర్డ్ పోస్ట్‌పై దాడి చేయాలని ప్లాన్ చేసారు. అయితే సైన్యానికి అప్పటికే వారి గురించి తెలియ‌డంతో సైన్యం దాడి చేసి ఈ కుట్రను భగ్నం చేసింది. చొరబాటు సమయంలో పాకిస్థాన్ బోర్డర్ యాక్షన్ టీమ్ సభ్యులు మరణించారు. ఈ బృందం సరిహద్దు కార్యకలాపాలలో ప్రత్యేకత కలిగి ఉంది.

అంతకుముందు ఫిబ్రవరి 3న కుల్గామ్‌లో రిటైర్డ్ లాన్స్ నాయక్ కుటుంబంపై ఉగ్రవాదులు దాడి చేశారు. ఇందులో రిటైర్డ్ లాన్స్ నాయక్ మంజూర్ అహ్మద్ మృతి చెందాడు. కాగా అతని భార్య, కుమార్తె గాయపడ్డారు. లాన్స్ నాయక్ కడుపులో కాల్చగా, అతని భార్య కాలికి, కుమార్తె చేతికి బుల్లెట్ గాయాలు అయ్యాయి.

 

  Last Updated: 26 Feb 2025, 03:04 PM IST