Site icon HashtagU Telugu

Trinamool Leader Shot Dead : పశ్చిమ బెంగాల్‌లోని ముర్షిదాబాద్‌లో టీఎంసీ నేత హత్య

Crime

Crime

Trinamool Leader Shot Dead : పశ్చిమ బెంగాల్‌లోని ముర్షిదాబాద్ జిల్లా బహరంపూర్‌లో బుధవారం స్థానిక తృణమూల్ కాంగ్రెస్ నాయకుడిని కాల్చి చంపడంతో ఉద్రిక్తత నెలకొంది. మృతుడు ప్రదీప్ దత్తాగా గుర్తించారు. దత్తా మార్నింగ్ వాక్ చేస్తుండగా, గుర్తు తెలియని దుండగులు అతడిపై కాల్పులు జరిపారని పోలీసులు తెలిపారు. దత్తాపై దుండగులు ఏడు రౌండ్లు బుల్లెట్లను కాల్చారని జిల్లా పోలీసు అధికారి తెలిపారు. అయితే.. కాల్పుల శబ్దం విన్న స్థానికులు వారి నివాసం నుండి బయటకు వచ్చి చూడగా దత్తాకు తీవ్ర రక్తస్రావం జరిగింది. దీంతో.. అతడిని సమీపంలోని ఆసుపత్రికి తరలించగా, అక్కడికి చేరుకునేలోపే చనిపోయినట్లు ప్రకటించారు.

Vote for Note : మరోసారి ఓటుకు నోటు కేసు విచారణ వాయిదా

అయితే.. బహరంపూర్ పోలీస్ స్టేషన్ నుండి భారీ పోలీసు బలగాలు సంఘటనా స్థలానికి చేరుకున్నాయి. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు… ఇది హత్య రాజకీయ నేరమా లేక శతృత్వమా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అప్పటికే మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు పోలీసులు. అయితే.. ఈ కేసు కోసం పలు పోలీసు బృందాలను ఏర్పాటు చేశారు ఉన్నతాధికారులు. ఈ నేపథ్యంలోనే దుండగులను గుర్తించేందుకు సీటీవీ కెమెరా ఫుటేజీలను పరిశీలిస్తున్నారు పోలీసులు. “అదే సమయంలో, ఈ సంఘటన గురించి మరింత సమాచారం పొందడానికి మేము స్థానిక ప్రజలను కూడా ప్రశ్నిస్తున్నాము” అని జిల్లా పోలీసు అధికారి తెలిపారు.

ఇదిలావుండగా, ముర్షిదాబాద్ జిల్లాలోని డోమ్‌కల్‌లో జరిగిన ఈ సంఘటనలో, ముడి బాంబు పేలుడు కారణంగా బుధవారం ఉదయం ఒక వ్యక్తి మరణించాడు. పేలుడు తాకిడికి బాధితుడి శరీరం ముక్కలు ముక్కలైంది. బాధితుడిని మోమిన్ మోండల్‌గా గుర్తించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించిన పోలీసులు కేసు దర్యాప్తు ప్రారంభించారు. బాధితుడు ముడి బాంబులను అసెంబ్లింగ్ చేసే పనిలో నిమగ్నమై ఉండగా బహుశా పేలుడు సంభవించి ఉంటుందని జిల్లా పోలీసు వర్గాలు తెలిపాయి. బాధితురాలి కుటుంబ సభ్యులు అతని నేర చరిత్రను అంగీకరించినట్లు పోలీసు వర్గాలు తెలిపాయి. బాధితురాలిని ఎప్పటికప్పుడు క్రూడ్‌బాంబుల తయారీకి నియమించుకున్నట్లు వారు అంగీకరించారు.

Sajjala Ramakrishna Reddy : సజ్జలకు నోటీసులు..రేపు విచారణకు రావాలని ఆదేశం