త్వరలో కొద్దిరోజుల్లో బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. దాదాపు రెండున్నర ఏళ్ల తర్వాత అంగరంగవైభవంగా జరగనున్నాయి. ఈ నేపథ్యంలో తిరుమల శ్రీవారి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం కార్యక్రమాన్ని తితిదే వైభవంగా నిర్వహించింది. తితిదే ఈవో ఏవీ ధర్మారెడ్డి ఆధ్వర్యంలో ఆలయ అధికారులు, వేదపండితులు కలిసి ఆలయాన్ని శుద్ధి చేశారు. త్వరలో బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో తితిదే ఈ కార్యక్రమం చేపట్టింది.