Telangana : దళిత బంధుకు రూ. 600కోట్లు రిలీజ్..!!

తెలంగాణ సీఎం కేసీఆర్ నాయకత్వరంలోని TRSసర్కార్ అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న దళిత బంధు కోసం మంగళవారం రూ. 600కోట్లను విడుదల చేసింది.

  • Written By:
  • Publish Date - September 21, 2022 / 05:59 AM IST

తెలంగాణ సీఎం కేసీఆర్ నాయకత్వరంలోని TRSసర్కార్ అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న దళిత బంధు కోసం మంగళవారం రూ. 600కోట్లను విడుదల చేసింది. దీంతో ఈ పథకం కింద ఇప్పటివరకు ఎంపికైన లబ్దిదారలందరికీ ఎస్సీ కార్పొరేషన్ ఆర్థిక సాయాన్ని వారి ఖాతాల్లోకి జమ చేసింది. రాష్ట్రవ్యాప్తంగా పలు కేటగిరీల్లో ఇప్పటివరకు 38,476మంది లబ్దిదారులు ఈ పథకం కింద ఎంపికయ్యారు.

ప్రస్తుతం ఎంపికైన లబ్దిదారుల అకౌంట్లో 3,847.6కోట్లు సర్కార్ జమ చేసింది. ఒక దళిత కుటుంబానికి రూ. 10లక్షల రూపాయలు ఇచ్చి ఆదుకునేందుకు ఈ పథకాన్ని ప్రభుత్వం తీసుకువచ్చింది. ప్రస్తుతం ఈ పథకం వంద శాతం విజయవంతంగా కొనసాగుతోంది.