నాగార్జునసాగర్ ప్రాజెక్టులోకి బలవంతపు ప్రవేశంపై ఏపీ పోలీసులు, ఇరిగేషన్ అధికారులపై తెలంగాణ పోలీసులు కేసు నమోదు చేశారు. సీసీ కెమెరాలను ధ్వంసం చేసి తమ భూభాగంలోకి బలవంతంగా ప్రవేశించారని తెలంగాణ ఎస్పీఎఫ్ సిబ్బంది ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. తెలంగాణ పోలీసులు సెక్షన్ 447 మరియు 427 కింద కేసు నమోదు చేశారు.
సమస్యను పరిష్కరించడానికి కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు అధికారులు చర్చలు జరుపుతున్నారు. సంఘటనా స్థలాన్ని సందర్శించి జరిగిన ఘర్షణలపై ఆరా తీశారు. ఏపీ పోలీసులు బలవంతంగా ప్రాజెక్టులోకి ప్రవేశించారని, ఫలితంగా ఘర్షణ చోటుచేసుకుందని తెలంగాణ ఎస్పీఎఫ్ సిబ్బంది కేఆర్ఎంబీ అధికారులకు వివరించారు.