Medico Dies: అనుమానస్పద స్థితిలో మెడికో స్టూడెంట్ మృతి

గైనకాలజీ విభాగంలో పీజీ రెండో సంవత్సరం చదువుతున్న డాక్టర్ శ్వేత తన గదిలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది.

Published By: HashtagU Telugu Desk
Medico

Medico

గైనకాలజీ విభాగంలో పీజీ రెండో సంవత్సరం చదువుతున్న డాక్టర్ శ్వేత శుక్రవారం తెల్లవారుజామున నిజామాబాద్‌లోని ప్రభుత్వ వైద్య కళాశాల (జీజీహెచ్)లోని తన హాస్టల్ గదిలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. కరీంనగర్‌కు చెందిన శ్వేత శుక్రవారం తెల్లవారుజాము వరకు పనిచేసి నిద్ర పోయింది. ఆమె రూమ్మేట్ అపస్మారక స్థితిలో శ్వేతను చూసింది. గైనకాలజీ విభాగంలో ఉదయం 12 గంటల వరకు డాక్టర్ శ్వేత విధుల్లో ఉన్నారని కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ప్రతిమరాజ్ తెలిపారు. ఆ తర్వాత రాత్రి తన గదిలోకి వెళ్లి పడుకుంది. తరువాత, ఆమె రూమ్‌మేట్ డ్యూటీ ముగించుకుని గదికి చేరుకోవడంతో శ్వేత అపస్మారక స్థితిలో ఉందని, ఆమెలో చలనం లేదని గుర్తించింది. వెంటనే కళాశాల అధికారులు, పోలీసులు అప్రమత్తమయ్యారు. విషయం తెలుసుకున్న అధికారులు శ్వేత తల్లిదండ్రులకు సమాచారం అందించారు.

పీజీ విద్యార్థిని ఆకస్మిక మృతితో వైద్య కళాశాల, జీజీహెచ్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. సిబ్బంది, విద్యార్థులు శ్వేతతో తమకున్న అనుబంధాన్ని, స్నేహాన్ని గుర్తు చేసుకున్నారు. శ్వేత మరణానికి సరైన కారణాలు తెలియనప్పటికీ, కోవిడ్-19 తర్వాత లక్షణాల కారణంగా ఆమె మరణించినట్లు వైద్యులు భావిస్తున్నారు. ఆమె గతంలో రెండుసార్లు వైరస్ బారిన పడింది. ఆమె మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

  Last Updated: 13 May 2022, 04:52 PM IST