TS Governor: విమానంలో ప్రయాణికుడికి అస్వస్థత.. తమిళిసై ట్రీట్ మెంట్

తెలంగాణ గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందరరాజన్ శనివారం న్యూఢిల్లీ-హైదరాబాద్ విమానంలో

Published By: HashtagU Telugu Desk
Governer

Governer

తెలంగాణ గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందరరాజన్ శనివారం న్యూఢిల్లీ-హైదరాబాద్ విమానంలో అస్వస్థతకు గురైన తోటి ప్రయాణికుడికి వైద్యం చేశారు. ఇండిగో విమానం బయలుదేరిన తర్వాత ఓ ప్రయాణికుడు తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. దీంతో ఎయిర్ హోస్టెస్ ఈ ఫ్లైట్ లో డాక్టర్ ఎవరైనా ఉన్నారా అని అడిగింది. ఒక ప్రయాణికుడు నిద్రమత్తులో విపరీతంగా చెమటలు పట్టడం చూసి గవర్నర్ సౌందరరాజన్ వెంటనే ట్వీట్ చేశారు. అతనికి అజీర్తి లక్షణాలు కనిపించాయని తెలిసింది.

“అతన్ని ఫ్లాట్‌గా పడుకునేలా చేసి, ప్రథమ చికిత్స, సహాయక మందులు అందించి ట్రీట్ మెంట్ అందించింది. హైదరాబాద్ చేరుకోగానే ప్రయాణికుడిని వీల్ చైర్ లో ఎయిర్ పోర్ట్ మెడికల్ సెంటర్ కు తరలించారు. గవర్నర్ సకాలంలో వైద్య చికిత్సలు చేయడంతో ఎయిర్ పోర్ట్ సిబ్బందితోపాటు తోటి ప్రయాణికులు తమిళిసైను అభినందించారు. తమిళిసై సౌందరరాజన్ తన M.B.B.S., P.G పూర్తి చేసిన తర్వాత మెడికల్ ప్రాక్టీషనర్‌గా తన వృత్తిని ప్రారంభించింది. రాజకీయాల్లోకి రాకముందు ఆమె వైద్యురాలు.

 

  Last Updated: 23 Jul 2022, 05:21 PM IST