Revanth Reddy: అగ్ని వీరులకు రేవంత్ న్యాయ సాయం!

సికింద్రాబాద్ ఘటనలో ఆర్మీ అభ్యర్థులు అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. 

Published By: HashtagU Telugu Desk
revanth

revanth

సికింద్రాబాద్ ఘటనలో ఆర్మీ అభ్యర్థులు అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. నిరసనకారులపై పలు కేసులు నమోదు చేసిన పోలీసులు చంచల్ గూడ జైలుకు తరలించారు. శుక్రవారం తెలంగాణ కాంగ్రెస్‌ చీఫ్‌ రేవంత్‌రెడ్డి అగ్ని వీరులతో ములాఖత్ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అగ్నిపథ్‌ నిరసనల్లో పాల్గొని కేసుల్లో నమోదైన ఆర్మీ అభ్యర్థులకు న్యాయ సహాయం అందజేస్తామని అన్నారు. దేశ భద్రతను దృష్టిలో ఉంచుకుని అగ్నిపథ్ పథకాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. చంచల్‌గూడ జైలు వెలుపల కాంగ్రెస్‌ సీనియర్‌ నేతలతో కలిసి సికింద్రాబాద్‌ స్టేషన్‌లో జైల్లో ఉన్న ఆందోళనకారులతో రేవంత్‌ విలేకరుల సమావేశంలో ఈ విషయాన్ని వెల్లడించారు. ఫిట్‌నెస్‌, మెడికల్‌ పరీక్షల్లో ఉత్తీర్ణులైన అభ్యర్థులకు తప్పనిసరిగా రాతపరీక్షలు నిర్వహించి,  నియమించాలని డిమాండ్‌ చేశారు. ఆందోళనకారులపై పెట్టిన కేసులను కేంద్ర, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలు వెనక్కి తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

“ ఆర్మీలో చేరాలనుకునేవాళ్లలో ఎక్కువ మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు చెందినవారే. రిమాండ్‌లో ఉన్న ఈ పిల్లల తల్లిదండ్రులకు వారి ఆచూకీ గురించి తెలియదు. భవిష్యత్తులో ఎవరికీ ఉద్యోగం రాకుండా ఉండేందుకు వారిపై హత్యాయత్నం, ఇతర నాన్ బెయిలబుల్ కేసులు కూడా నమోదయ్యాయి. తాము ఎలాంటి విధ్వంసానికి పాల్పడలేదని పిల్లలు చెప్పారు’’ అని రేవంత్ అన్నారు.  ఆందోళనకారులపై కేసుల విషయంలో కూడా టీఆర్ఎస్, రాష్ట్ర ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావుపై రేవంత్ విరుచుకుపడ్డారు. “సికింద్రాబాద్ నిరసనకారుడు డి రాకేష్ మరణంపై టిఆర్ఎస్ మొసలి కన్నీరు కార్చింది. అయితే ఈ ఆర్మీ ఆశావహులపై జైల్లో కేసులు పెట్టింది. ఈ అంశంపై టీఆర్‌ఎస్ రాజకీయాలకు పాల్పడుతోందని ఆయన విమర్శించారు. జూన్ 17న సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో అగ్నిపథ్ స్కీమ్‌కు వ్యతిరేకంగా జరిగిన నిరసన కార్యక్రమంలో పోలీసులు జరిపిన కాల్పుల్లో ఒకరు మృతి చెందగా, 12 మంది గాయపడ్డారు.

  Last Updated: 24 Jun 2022, 02:36 PM IST