Yatra: నేటి నుంచి రెండో విడ‌త ప్ర‌జా సంగ్రామ యాత్ర‌.. త‌మ‌పై దాడులు జ‌రిగే అవ‌కాశ‌ముంద‌న్న బండి సంజ‌య్‌

తెలంగాణ‌లో బీజేపీ దూకుడుగా వ్య‌వ‌హ‌రిస్తుంది. ఇప్ప‌టికే మొద‌టి విడ‌త ప్ర‌జా సంగ్రామ యాత్ర‌తో ఫుల్ జోష్ మీద ఉన్న బీజేపీ నేత‌లు నేటి నుంచి రెండోవిడ‌త సంగ్రామ యాత్ర‌కు సిద్ధ‌మైయ్యారు.

  • Written By:
  • Updated On - April 14, 2022 / 10:25 AM IST

తెలంగాణ‌లో బీజేపీ దూకుడుగా వ్య‌వ‌హ‌రిస్తుంది. ఇప్ప‌టికే మొద‌టి విడ‌త ప్ర‌జా సంగ్రామ యాత్ర‌తో ఫుల్ జోష్ మీద ఉన్న బీజేపీ నేత‌లు నేటి నుంచి రెండోవిడ‌త సంగ్రామ యాత్ర‌కు సిద్ధ‌మైయ్యారు. తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజ‌య్ ఈ యాత్ర‌ను చేప‌ట్టారు. రెండవ విడత ప్రజా సంగ్రామ యాత్ర నేటి (గురువారం) నుంచి ప్రారంభం కానుంది. గురువారం సాయత్రం గద్వాల జిల్లాలోని అలంపూర్ జోగుళాంబ అమ్మవారి ఆలయం వద్ద నుంచి యాత్రను ప్రారంభించనున్నారు. మధ్యాహ్నం 3.30 గంటలకు బండి సంజయ్ హైదరాబాద్ నుంచి అలంపూర్ చేరుకుంటారు.

జోగులాంబ అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజల అనంతరం సాయంత్రం 5గంటలకు అక్కడ నిర్వహించే బహిరంగ సభలో పాల్గొంటారు. ఈ పాదయాత్రను బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి తరుణ్‌ఛుగ్ ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రారంభించనున్నారు. బహిరంగ సభ అనంతరం తొలిరోజు సంజయ్ నాలుగు కిలో మీటర్లు పాదయాత్రలో పాల్గొని రాత్రి ఇమామ్‌పూర్‌లో బస చేస్తారు. అయితే ప్ర‌జా సంగ్రామ యాత్ర‌లో దాడులు చేసేందుకు టీఆర్ఎస్ నేత‌లు కుట్ర‌లు చేస్తున్నార‌ని బండి సంజ‌య్ ఆరోపించారు. రైతుల ముసుగులో మాపై దాడులు చేయించే అవ‌కాశ‌ముంద‌న్నారు. దీంతో ప్ర‌జాసంగ్రామ యాత్ర‌కు పోలీసులు భారీ భ‌ద్ర‌త క‌ల్పించారు.