Site icon HashtagU Telugu

Team India: ఆస్ట్రేలియా ప్రధానితో టీమిండియా ముచ్చట్లు…

Team India Meets Australia Prime Minister

Team India Meets Australia Prime Minister

ఆస్ట్రేలియాలో పర్యటనలో ఉన్న భారత క్రికెట్ జట్టు, ప్రధాని ఆంథోని ఆల్బనీస్ (Anthony Albanese) ను కలిసింది. ప్రైమ్ మినిస్టర్స్‌ XI జట్టుతో శనివారం నుంచి రెండు రోజుల వార్మప్ మ్యాచ్ ఆడనున్న టీమ్ ఇండియా, ఈ సందర్భంగా కాన్‌బెర్రాలోని పార్లమెంట్ హౌస్ లో ప్రధాని ఆల్బనీస్‌తో భేటీ అయ్యారు.

ఈ సమావేశంలో భారత క్రికెటర్లు ప్రధానితో ఫొటోలు దిగారు. ఈ సమయంలో ఆల్బనీస్ – విరాట్ కోహ్లీ మధ్య ఆసక్తికరమైన చర్చ జరిగింది, అది సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఇప్పుడు, పెర్త్ వేదికగా జరిగిన తొలి టెస్టులో భారత్ గెలుపొందిన సంగతి తెలిసిందే, అలాగే విరాట్ కోహ్లీ సెంచరీ కూడా బాదేశాడు. ఆస్ట్రేలియా ప్రధాని ఆల్బనీస్ మాట్లాడుతూ, ‘‘పెర్త్‌లో అద్భుతం జరిగింది. ఆ సమయంలో మా వాళ్లు పెద్దగా బాధపడినట్లు లేదు’’ అని వ్యాఖ్యానించారు.

దానికి విరాట్ కోహ్లీ నవ్వుతూ ‘‘మీరు మసాలా జోడించడానికి ఎల్లప్పుడూ ముందుంటారు’’ అని సమాధానం ఇచ్చాడు. ఇది అందరినీ నవ్వింప చేసింది.

అలాగే, ఆల్బనీస్ భారత క్రికెటర్లతో దిగిన ఫొటోలను సోషల్ మీడియాలో పంచుకొని, ‘‘భారత్‌తో ఆడటం ప్రైమ్ మినిస్టర్స్‌ XI కు పెద్ద ఛాలెంజే. అయితే, ప్రధాని మోదీకి చెప్పినట్లుగా, మా వాళ్లు అద్భుతంగా రాణించేందుకు నేను అండగా ఉంటా’’ అని ట్వీట్ చేశారు.