టీడీపీ సీనియర్ నేత, ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు నిన్న(గురువారం) రాత్రి మరణించారు. ఇటీవల గుండెపోటుకు గురై విజయవాడలోని ఓ ప్రవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. గన్నవరం టీడీపీ కార్యాలయంలో ఆయన పార్ధీవదేహాన్ని ప్రజల సందర్శనార్థం ఉంచారు. బచ్చుల మృతికి టీడీపీ అధినేత సంతాపం తెలిపారు.హైదరాబాద్ నుంచి నేరుగా గన్నవరం వచ్చిన టీడీపీ అధినేత చంద్రబాబు పార్టీ కార్యాలయంలో ఆయన భౌతికకాయాన్ని సందర్శించి నివాళ్లు అర్పించారు. ఈ రోజు ( శుక్రవారం) బచ్చుల అర్జునుడు అంత్యక్రియలు మచిలీపట్నంలో జరగనున్నట్లు ఆయన కుటుంబసభ్యులు తెలిపారు.