Viral Video: ఫారెస్ట్ ఆఫీసర్లకు థాంక్స్ చెప్పిన ఏనుగు.. ఎంత బాగుందో!

సోషల్ మీడియాలో నిత్యం ఎన్నో రకాల వీడియోలు వైరల్ అవుతూ ఉంటాయి. అయితే అందులో కొన్ని కామెడీగా మరి

  • Written By:
  • Updated On - September 23, 2022 / 11:23 PM IST

సోషల్ మీడియాలో నిత్యం ఎన్నో రకాల వీడియోలు వైరల్ అవుతూ ఉంటాయి. అయితే అందులో కొన్ని కామెడీగా మరి కొన్ని బాధాకరంగా ఉంటాయి. మరికొన్ని వీడియోలను చూస్తే మనసుకు తెలియని ఆనందం కలుగుతూ ఉంటుంది. మరీ ముఖ్యంగా జంతువుల కు సంబంధించిన వీడియోలు ఎక్కువగా వైరల్ అవుతూ ఉంటాయి. తాజాగా అలాంటి వీడియోని ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఆ వీడియోలో ఒక ఏనుగు చేసిన పని నెటిజెన్ల దృష్టిని విపరీతంగా ఆకట్టుకుంటోంది. పూర్తి వివరాల్లోకి వెళితే..

తమిళనాడు లోని అడవిలో ఒక పిల్ల ఏనుగు తన తల్లి ఏనుగు దగ్గర నుంచి పోవడంతో వెంటనే అటవీ అధికారులు ఆ పిల్ల ఏనుగును తీసుకొని వచ్చి ఆ తల్లి ఏనుగు కి అప్పగించారు. అందుకు కృతజ్ఞతతో ఆ తల్లి ఏనుగు థాంక్స్ కూడా చెప్పింది. అదెలా అంటే.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఆ వీడియోలో పిల్ల ఏనుగు, తల్లి ఏనుగు రెండు కలసి వెళుతున్నాయి. ఇక దూరం నుంచి అటవీ అధికారులు వాటిని వీడియో తీస్తూ ఉన్నారు.

అప్పుడు ఆ పిల్ల ఏనుగు, తన తల్లి ఏనుగు వెళుతూ ఉన్నట్టుండి ఆ తల్లి ఏనుగు వెనక్కి తిరిగి ఆ ఫారెస్ట్ అధికారులకు తొండం ఎత్తి దీవించినట్టుగా థాంక్స్ చెప్పి అక్కడ నుంచి వెళ్లిపోయింది. తన బిడ్డను క్షేమంగా అప్పగించినందుకు ఆ అటవీశాఖ అధికారులకు ఆ ఏనుగు థాంక్స్ చెప్పడం చూసిన నెటిజన్స్ కామెంట్ ల వర్షం కురిపిస్తున్నారు. అయితే ఈ వీడియోని చూసినా కొందరు నెటిజెన్స్ జంతువులకు పెద్దగా ఎమోషన్స్ ఫీలింగ్స్ ఉండవు అని వాదించే వారికి ఈ వీడియో చక్కటి ఉదాహరణ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇంకొందరు అటవీశాఖ అధికారులను పొగుడుతూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.