MaheshBabu: హ‌ర్ ఘ‌ర్ తిరంగా పేరిట హోరెత్తుతున్న ప్ర‌చారం…గర్వంగా భావిద్దామంటూ మ‌హేశ్ బాబు పిలుపు..!

మనదేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 సంవత్సరాలు పూర్తి అవుతున్న సందర్భంగా కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ఆజాదీ కా అమృత్ మ‌హోత్స‌వాలు దేశవ్యాప్తంగా ఘనంగా జరుగుతున్నాయి.

  • Written By:
  • Updated On - May 6, 2023 / 02:57 PM IST

మనదేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 సంవత్సరాలు పూర్తి అవుతున్న సందర్భంగా కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ఆజాదీ కా అమృత్ మ‌హోత్స‌వాలు దేశవ్యాప్తంగా ఘనంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా ఈ వేడుకలు ఈనెల 13 నుంచి 15వరకు దేశ ప్రజలంతా తమ ఇళ్లపై జాతీయ జెండాను ఆవిష్కరించాలంటూ కేంద్రం పిలుపునిచ్చిన విషయం అందరికీ తెలిసిందే. హర్ ఘర్ తిరంగా పేరుతో దేశవ్యాప్తంగా ప్రచారం హోరెత్తుతోంది.

ఈ ప్రచారంలో భాగంగా టాలీవుడ్ సూపర్ స్టార్ ప్రిన్స్ మహేశ్ బాబు కూడా పాలుపంచుకున్నారు. ఈ మేరకు ఆయన సోషల్ మీడియా వేదికగా ఓ ట్విట్ చేశారు. త్రివర్ణ పతాకం మనకు గర్వకారణమని పేర్కొన్నారు. త్రివర్ణ జాతీయ పతాకాన్ని ఎగురవేద్దామంటూ అందరూ ప్ర‌తిజ్ఞ చేద్దామంటూ పిలుపునిచ్చారు. హర్ ఘర్ తిరంగా హ్యాష్ ట్యాగ్ ను ట్వీట్ కు జత చేశారు మహేశ్ బాబు.