Site icon HashtagU Telugu

IIIT Basara: తిరగబడ్డ త్రిపుల్ ఐటీ స్టూడెంట్స్!

Basara

Basara

బాసర త్రిపుల్ ఐఐటీ విద్యార్థుల ఆందోళన కొనసాగుతోంది. ఎండను, వానను సైతం లెక్క చేయకుండా తమ సమస్యల పరిష్కారం కోసం ఉద్యమిస్తున్నారు. పురుగుల అన్నం, బల్లులు కనిపించే ఆహరం తమకొద్దంటూ పెద్ద ఎత్తున నిరసనకు దిగారు. జోరువానలో కూడా గొడుగులు పట్టుకొని విద్యార్థులు ఉద్యమించడం రాష్ట్రవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది.

తెలంగాణలోని రాజీవ్ గాంధీ యూనివర్శిటీ ఆఫ్ నాలెడ్జ్ అండ్ టెక్నాలజీస్ (RGUKT) విద్యార్థులు బుధవారం వరుసగా రెండో రోజు తమ నిరసనను కొనసాగించారు. నిర్మల్ జిల్లాలోని బాసర పట్టణంలోని ఐఐఐటీ బాసరగా ప్రసిద్ధి చెందిన ఆర్‌జియుకెటి విద్యార్థులు తమ డిమాండ్‌లకు మద్దతుగా భవనం ప్రధాన గేటు వద్ద బైఠాయించారు. నాణ్యత లేని ఆహారం, ఇతర ప్రాథమిక సౌకర్యాలను మెరుగుపరచాలని, రెగ్యులర్ వైస్-ఛాన్సలర్‌ను కూడా నియమించాలని డిమాండ్ చేస్తూ నిరసనలు చేస్తున్నారు. వర్షం పడుతున్న వందలాది మంది విద్యార్థులు రెండో రోజు కూడా తమ నిరసనను కొనసాగించారు. తమ 12 డిమాండ్లను ఎత్తిచూపుతూ ప్లకార్డులు పట్టుకుని నినాదాలు చేశారు. ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు, మంత్రి కె.టి.రామారావు ఆర్‌జియుకెటిని సందర్శించి తాము ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకోవాలని డిమాండ్ చేశారు. విద్యార్థులు బయటకు రాకుండా పోలీసులు కూడా గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు.

హాస్టల్ మెస్‌లో అందిస్తున్న భోజనం నాణ్యత లేదని విద్యార్థులు వాపోతున్నారు. హాస్టల్ ఫుడ్‌లో చిన్న కీటకాలు, కప్పలు కనిపించాయని ఆవేదన వ్యక్తం చేశారు. సరైన తాగునీటి సౌకర్యం కూడా లేదని, ఈ విషయమై పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఎలాంటి చర్యలు తీసుకోలేదని విద్యార్థి నాయకుడు తెలిపారు. తమ సమస్యలు పరిష్కరించే వరకు తమ నిరసనను కొనసాగిస్తామని విద్యార్థులు తెలిపారు. మరోవైపు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి వైస్‌ ఛాన్సలర్‌తో సమావేశమయ్యారని తెలిపారు. వీలైనంత త్వరగా అన్ని సమస్యలను పరిష్కరిస్తామని ఆమె హామీ ఇచ్చారు. సమస్యలను విద్యాశాఖ మంత్రి దృష్టికి తీసుకెళ్తానని ఐటీ శాఖ మంత్రి కె.టి.రామారావు ట్వీట్ చేయడంతో మంత్రి ఈ మేరకు హామీ ఇచ్చారు. సమస్యలపై ఓ విద్యార్థి తన దృష్టికి తీసుకెళ్లిన ట్వీట్‌పై రామారావు స్పందించారు.

జోరువానలో సైతం..

బాసర ఐఐటీ విద్యార్థులు జోరువానలో ఆందోళన కార్యక్రమాలు చేయడం పలువురిని కదిలిస్తోంది. వెంటనే విద్యార్థుల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నాయి. సమస్యలను పరిష్కరించకపోతే విద్యార్థుల ఆగ్రహానికి గురికావాల్సి ఉంటుందని తేల్చి చెప్పాయి. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి బాసర ఉద్యమంపై స్పందించి ట్వీట్ చేశారు.

Exit mobile version