Food Poisoning : కోయంబ‌త్తూర్ హాస్ట‌ల్ లో ఫుడ్ పాయిజ‌న్‌.. 13 మంది విద్యార్థులు..?

తమిళనాడులోని కోయంబత్తూరు జిల్లాలోని ఓ హాస్ట‌ల్‌లో ఫుడ్ పాయిజ‌న్ జ‌రిగింది...

  • Written By:
  • Publish Date - September 22, 2022 / 08:02 AM IST

తమిళనాడులోని కోయంబత్తూరు జిల్లాలోని ఓ హాస్ట‌ల్‌లో ఫుడ్ పాయిజ‌న్ జ‌రిగింది. సూలూరు సమీపంలోని లక్ష్మీనాయకన్‌పాళయంలో సోమవారం రాత్రి ఓ ప్రైవేట్ స్కూల్ హాస్టల్‌లో నివసిస్తున్న 13 మంది చిన్నారులకు ఫుడ్‌ పాయిజన్‌ ​​కావడంతో వారిని ఆస్పత్రికి తరలించారు. 13 మంది బాలురు అస్వ‌స్థ‌త‌కు గురికావడంతో సూలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వారిలో కొందరు స్పృహ తప్పి పడిపోయారు. సోమవారం సాయంత్రం నల్ల చన్నా (చిక్‌పీస్), టీ , జ్యూస్ తాగిన‌ట్లు తెలుస్తోంది. ఎనిమిది మంది చిన్నారులకు ఐవీ డ్రిప్‌లు వేసి వారందరినీ రాత్రిపూట పరిశీలనలో ఉంచినట్లు అధికారులు తెలిపారు. మంగళవారం వారిని తిరిగి హాస్టల్‌కు పంపించారు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. చిన్నారులు తినే ఆహారం శాంపిల్స్‌ను ఆహార భద్రతా విభాగం అధికారులు సేకరించారు.