Stock Market: భారత స్టాక్ మార్కెట్లు (Stock Market) ఈరోజు నిరాశాజనకంగా ప్రారంభమైంది. సెన్సెక్స్ 1130 పాయింట్లు, నిఫ్టీ 370 పాయింట్లు దిగువన ప్రారంభమయ్యాయి. బ్యాంక్ నిఫ్టీలోనూ 1552 పాయింట్ల క్షీణత నమోదైంది. హెచ్డిఎఫ్సి బ్యాంక్ త్రైమాసిక ఫలితాల తర్వాత బుధవారం బహిరంగ మార్కెట్లో నిరాశ నెలకొంది. హెచ్డిఎఫ్సి షేర్లు రూ.109 తగ్గి రూ.1570 వద్ద ప్రారంభమయ్యాయి. ఉదయం 9:22 గంటల సమయంలో సెన్సెక్స్ 706 పాయింట్లు నష్టపోయి 72,422 దగ్గర కొనసాగుతోంది. నిఫ్టీ 199 పాయింట్లు కుంగి 21,833 వద్ద ట్రేడవుతోంది. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ 83.14 దగ్గర ప్రారంభమైంది.
Also Read: Price Hike: కార్ల ధర పెంచిన ప్రముఖ కంపెనీ.. కారణమిదే..?
బ్యాంకు షేర్లు పతనమవుతున్నాయి
మంగళవారం సాయంత్రం మార్కెట్ ముగిసిన తర్వాత హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఫలితాలను విడుదల చేసింది. దీని ప్రభావం బుధవారం ఉదయం కనిపించింది. బీఎస్ఈ సెన్సెక్స్లో చాలా వరకు బ్యాంకు షేర్లు పతనమవుతున్నాయి. వీటిలో యెస్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, ఐసీఐసీఐ, యాక్సిస్, కోటక్ షేర్లు కూడా దిగువన ప్రారంభమయ్యాయి. NAC నిఫ్టీలో కూడా అదే పరిస్థితి నెలకొంది. అమెరికా మార్కెట్లు మంగళవారం నష్టాలతో ముగిశాయి. ఐరోపా సూచీలూ అదే బాటలో పయనించాయి. ఆసియా- పసిఫిక్ సూచీలు నేడు నష్టాలతో ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్లో బ్యారెల్ బ్రెంట్ చమురు ధర గత 24 గంటల్లో 0.38 శాతం తగ్గి 77.91 డాలర్ల వద్ద ట్రేడవుతోంది.
ప్రారంభ వ్యాపారంలో ఇవి టాప్ గెయినర్లు
బుధవారం ప్రారంభ ట్రేడింగ్లో కొచ్చిన్ షిప్యార్డ్, సిజిసిఎల్, ఎంఎస్టిసి లిమిటెడ్, ఐసిఐసిఐ జనరల్ ఇన్సూరెన్స్ మరియు ఎస్జెవిఎన్ బిఎస్ఇలో టాప్ గెయినర్లుగా ట్రేడవుతుండగా, అదానీ పోర్ట్స్, హెచ్డిఎఫ్సి లైఫ్, టిసిఎస్, ఇన్ఫోసిస్ మరియు అల్ట్రాటెక్ సిమెంట్ నిఫ్టీలో బలంగా ప్రారంభమయ్యాయి.
We’re now on WhatsApp. Click to Join.