Sri Ram Sene: మ‌సీదుల్లో లౌడ్ స్పీక‌ర్ల‌పై హిందూసేన ఫైట్‌

మ‌సీదుల్లో లౌడ్ స్పీక‌ర్ల ద్వారా ఆజాన్ వినిపిస్తోన్న ముస్లింల‌కు పోటీగా హిందూ మిత‌వాద సంస్థ శ్రీరామ్ సేన హ‌నుమాన్ చాలీసాను వినిపించ‌డానికి క‌ర్ణాట‌క రాష్ట్రంలో రంగంలోకి దిగింది.

  • Written By:
  • Updated On - May 9, 2022 / 05:31 PM IST

మ‌సీదుల్లో లౌడ్ స్పీక‌ర్ల ద్వారా ఆజాన్ వినిపిస్తోన్న ముస్లింల‌కు పోటీగా హిందూ మిత‌వాద సంస్థ శ్రీరామ్ సేన హ‌నుమాన్ చాలీసాను వినిపించ‌డానికి క‌ర్ణాట‌క రాష్ట్రంలో రంగంలోకి దిగింది. మైసూరులోని హనుమాన్ ఆలయం వద్ద లౌడ్ స్పీకర్లలో భక్తి పాటలను ప్లే చేసారు. ఆ సంద‌ర్భంగా జ‌నంతో క‌లిసి శ్రీరామ్ సేన అధినేత ప్రమోద్ ముతాలిక్ కూడా ఉన్నారు. మ‌సీదుల్లో లౌడ్ స్పీక‌ర్ల‌ను నిషేధం విష‌యంలో ప్ర‌భుత్వ వైఫ‌ల్యాన్ని నిరసిస్తూ ఇక నుంచి శ్రీరామ్ సేన కర్ణాటకలోని 1,000 దేవాలయాలలో ఉదయం 5 గంటలకు హనుమాన్ చాలీసా, సుప్రభాత లేదా ఇతర భక్తి గీతాలను ప్లే చేస్తుందని ఆయ‌న వెల్ల‌డించారు.

మతపరమైన ప్రదేశాల నుండి అనధికారిక లౌడ్ స్పీకర్లపై చర్యలు తీసుకోవడం ద్వారా ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ చూపిన “గట్స్” చూపించాలని క‌ర్ణాట‌క సీఎంకు శ్రీరామ్ సేన సూచించింది. ఉత్త‌ర‌ప్ర‌దేశ్ లో దాదాపు 54,000 అనధికారిక లౌడ్ స్పీకర్లను మత స్థలాల నుండి తొలగించారు. మరియు 60,000 లౌడ్ స్పీకర్ల వాల్యూమ్‌ను ఉత్తరప్రదేశ్ అంతటా అనుమతించదగిన పరిమితులుగా సెట్ చేసిన విష‌యాన్ని గుర్తు చేశారు. బసవరాజ్ బొమ్మై, హోం మంత్రి ఆరగ జ్ఞానేంద్ర చొర‌వ చూప‌డం ద్వారా క‌ర్ణాట‌క‌లో చ‌ర్య‌లు తీసుకోవాల‌ని కోరారు. రాష్ట్రంలోని 1,000 దేవాలయాలలో పాటలు, బెంగళూరునగరంలోని దేవాలయంలో పాటలు ప్లే చేయడానికి ముందు శ్రీరామ్ సేన క్యాడర్‌కు దిశానిర్దేశం చేసింది. దీంతో ఆ బృందాన్ని ప్రివెంటెటివ్ కస్టడీలోకి తీసుకున్నారు. కాగా, ఈ అంశంపై ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై తన వైఖరిని స్పష్టం చేయాలని రాష్ట్రంలోని రాజకీయ నాయకులు కోరారు.