వేసవి రద్దీ సమయంలో భారతీయ రైల్వే ప్రత్యేక రైళ్లను నడపడానికి సన్నద్ధమవుతోంది. ఆ క్రమంలో 968 ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. ఏప్రిల్ 30 నుంచి వారాంతాల్లో ప్రత్యేక రైళ్లు నడుస్తాయని రైల్వే శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ కొత్త రైళ్లలో ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినల్ మరియు మన్మాడ్ మధ్య 126 రైళ్లు, మాల్దా టౌన్ మరియు రేవా మధ్య ప్రయాణించే ఆరు సమ్మర్ స్పెషల్స్ మరియు దాదర్ మరియు మడ్గావ్ మధ్య ఆరు సమ్మర్ స్పెషల్స్ ఉన్నాయి.
మరోవైపు, తిరుపతి-హైదరాబాద్, తిరుపతి-ఔరంగాబాద్ మధ్య 20 ప్రత్యేక రైళ్లు కూడా ఉన్నాయని దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. హైదరాబాద్-తిరుపతి స్పెషల్ (07509) హైదరాబాద్లో శనివారం సాయంత్రం 4.35 గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 5.30 గంటలకు తిరుపతి చేరుకుంటుంది. ట్రైన్ నెం. 07510 తిరుపతి-హైదరాబాద్ స్పెషల్ ఏప్రిల్ 30, మే 7, 14, 21, 28 తేదీల్లో తిరుపతిలో ఉదయం 11.50 గంటలకు బయలుదేరి మరుసటి రోజు మధ్యాహ్నం 12.30 గంటలకు హైదరాబాద్ చేరుకుంటుంది. ఈ సర్వీస్ మే 3, 10, 17, 24, 31 తేదీల్లో అందుబాటులో ఉంటుంది. తిరుపతి-ఔరంగాబాద్ స్పెషల్ (07511) ఆదివారం ఉదయం 07.05 గంటలకు తిరుపతిలో బయలుదేరి మరుసటి రోజు ఉదయం 7 గంటలకు ఔరంగాబాద్ చేరుకుంటుంది. ఇది వరుసగా మే 1, 8, 15, 22 మరియు 29 తేదీలలో నడుస్తుంది.