Site icon HashtagU Telugu

Sonia Gandhi: ఆసుపత్రిలో చేరిన సోనియా గాంధీ.. ప్ర‌స్తుతం ఆరోగ్య ప‌రిస్థితి ఎలా ఉందంటే?

Sonia Gandhi

Sonia Gandhi

Sonia Gandhi: కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ (Sonia Gandhi) ఢిల్లీలోని సర్ గంగారామ్ ఆసుపత్రిలో చేరారు. ఆమె పరిస్థితి బాగానే ఉందని, శుక్రవారం డిశ్చార్జ్ అయ్యే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు తెలిపిన‌ట్లు పీటీఐ పేర్కొంది. 2024 డిసెంబర్‌లో సోనియా గాంధీకి 78 ఏళ్లు నిండిన విష‌యం తెలిసిందే. సర్ గంగా రామ్ హాస్పిటల్ మేనేజ్‌మెంట్ బోర్డు ఛైర్మన్ డాక్టర్ అజయ్ స్వరూప్ తెలిపిన వివరాల ప్రకారం.. కడుపు సంబంధిత సమస్యల‌ కారణంగా ఆమె గురువారం అడ్మిట్ అయ్యారు. అయితే, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపారు. శుక్ర‌వారం ఉదయం వరకు డిశ్చార్జ్ అయ్యే అవ‌కాశం ఉంది. సోనియా గాంధీకి ఎంటరాలజీ నిపుణుడు డాక్టర్ సమీరన్ నంది వైద్య చికిత్స‌లు అందిస్తున్నారు.

ఫిబ్రవరి 13న పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలకు హాజ‌రు

గత వారం సోనియా గాంధీ బ‌యట కనిపించారు. ఫిబ్రవరి 13న పార్లమెంటు బడ్జెట్ సమావేశాల సందర్భంగా ఆమె రాజ్యసభలో కనిపించారు. ఫిబ్రవరి 10న సోనియా గాంధీ వీలైనంత త్వరగా జనాభా లెక్కలను పూర్తి చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ఆహార భద్రత చట్టం కింద దేశ ప్రజలకు ఆహారం అందకుండా పోతుంద‌ని ఆరోపించారు.

Also Read: India Win: ఛాంపియ‌న్స్ ట్రోఫీలో భార‌త్ శుభారంభం.. గిల్ సెంచ‌రీతో బంగ్లాపై ఘ‌న విజ‌యం!

గ‌తేడాది సెప్టెంబ‌ర్‌లో కూడా ఆసుపత్రిలో చేరారు

గ‌తంలో కూడా సెప్టెంబర్ 2024లో కూడా సోనియా గాంధీ అనారోగ్యం కారణంగా సర్ గంగారామ్ ఆసుపత్రిలో చేరారు. ఆమెకి తేలికపాటి జ్వరం వచ్చింది. అంతకుముందు 2024 మార్చిలో ఆమె అనారోగ్యం కారణంగా సర్ గంగా రామ్ ఆసుపత్రిలో చేరారు. అయితే ఒక రోజు తర్వాత విడుదల చేసిన మెడికల్ బులెటిన్‌లో ఆమె పరిస్థితి నిలకడగా ఉందని, పూర్తిగా ఆరోగ్యంగా ఉన్నార‌ని పేర్కొన్నారు. అనారోగ్య కారణాల వల్ల గతేడాది డిసెంబర్‌లో కర్ణాటకలోని బెలగావిలో జరిగిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) సమావేశానికి కూడా సోనియా గాంధీ హాజరుకాలేదు.

కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ ప్ర‌స్తుతం రాజకీయాల్లో చాలా యాక్టివ్‌గా కనిపిస్తున్నారు. ఇటీవల పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాల్లో ఆమె పలు అంశాలపై ప్ర‌శ్న‌లు సంధించారు. రాష్ట్రపతి ప్రసంగానికి సంబంధించి ఆమె చేసిన ప్రకటనపై దుమారం రేగింది. రాజ్యసభలో జీరో అవర్‌లో సోనియా గాంధీ జాతీయ ఆహార భద్రతా చట్టం (ఎన్‌ఎఫ్‌ఎస్‌ఎ) కింద లబ్ధిదారులను 2011 జనాభా లెక్కల ప్రకారం గుర్తిస్తున్నారని, నవీకరించబడిన జనాభా డేటా ఆధారంగా కాదని అన్నారు. 2013 సెప్టెంబరులో యూపీఏ ప్రభుత్వం ప్రారంభించిన ఎన్‌ఎఫ్‌ఎస్‌ఎను దేశంలోని 140 కోట్ల జనాభాకు ఆహారం, పోషకాహార భద్రత కల్పించే లక్ష్యంతో చేపట్టిన చారిత్రాత్మక కార్యక్రమంగా సోనియా గాంధీ దీనిని అభివర్ణించారు.