Bihar : బీహార్‌ క‌ల్తీ మ‌ద్యం కేసు.. 70కి చేరిన మృతుల సంఖ్య‌..

బీహార్ క‌ల్తీ మ‌ద్యం కేసులో మృతుల సంఖ్య 70కి చేరింది. ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) సరన్ జిల్లాలో కేసుకు సంబంధించి

Published By: HashtagU Telugu Desk
Delhi Liquor

Liquor

బీహార్ క‌ల్తీ మ‌ద్యం కేసులో మృతుల సంఖ్య 70కి చేరింది. ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) సరన్ జిల్లాలో కేసుకు సంబంధించి ఒక మద్యం స్మగ్లర్‌ను అరెస్టు చేసి, రూ. 2.17 లక్షల నగదును స్వాధీనం చేసుకుంది. నిందితుడిని అఖిలేష్ కుమార్ యాదవ్ అలియాస్ అఖిలేష్ రాయ్‌గా గుర్తించారు. కల్తీ మద్యం సేవించడం వల్ల జరిగిన మరణాలకు సంబంధించి మష్రాఖ్, ఇషువాపూర్ పోలీస్ స్టేషన్‌లలో నమోదైన రెండు ఎఫ్‌ఐఆర్‌లలో నిందితుడి పేరు లేకపోయినా, సిట్ దర్యాప్తులో వారి ప్రమేయం నిర్ధారించబడింది. గతంలో కూడా మద్యం స్మగ్లర్‌పై ఎక్సైజ్ చట్టం కింద నాలుగు కేసులు నమోదయ్యాయి. ఈ మ‌ర‌ణాల త‌రువాత స‌ర‌న్‌లో అక్రమ మద్యం వ్యాపారం, రవాణా, స్మగ్లింగ్, మద్యం తయారీలో ప్రమేయం ఉన్నట్లు అనుమానిస్తున్న వ్యక్తులను గుర్తించి అరెస్టు చేయడానికి సరన్ పోలీసులు ఆపరేషన్ ప్రారంభించారు.

  Last Updated: 19 Dec 2022, 05:51 AM IST