Tamil Nadu Explosion: తమిళనాడులో బాణాసంచా ఫ్యాక్టరీలో పేలుడు: 8 మంది మృతి

తమిళనాడులోని కృష్ణగిరి జిల్లాలోని బాణాసంచా ఫ్యాక్టరీలో పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో ఎనిమిది మంది మృతి చెందారు.

Tamil Nadu Explosion: తమిళనాడులోని కృష్ణగిరి జిల్లాలోని బాణాసంచా ఫ్యాక్టరీలో పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో ఎనిమిది మంది మృతి చెందారు. ప్రమాదంపై ప్రధాని మోదీ ట్వీట్‌ చేస్తూ సంతాపం వ్యక్తం చేశారు. దీంతో పాటు మృతుల బంధువులకు, క్షతగాత్రులకు నష్టపరిహారం ప్రకటించారు.

బాణసంచా తయారీ కర్మాగారంలో జరిగిన భారీ పేలుడులో ముగ్గురు మహిళలు సహా 8 మంది మృతి చెందారు. జిల్లాలోని పాతాయపేటలో బాణాసంచా తయారీ గోడౌన్‌లో అకస్మాత్తుగా పేలుడు సంభవించడంతో పలువురు గాయపడ్డారు. ఈ ప్రమాదంపై సంతాపం వ్యక్తం చేస్తూ ప్రధాని మోదీ ట్వీట్‌ చేశారు. మృతి చెందిన వారి బంధువులకు రూ.2 లక్షలు, క్షతగాత్రులకు రూ.50 వేలు పరిహారంగా అందజేస్తారు. పేలుడు తాకిడికి యూనిట్ సమీపంలోని ఇళ్లు, కొన్ని దుకాణాలు దెబ్బతిన్నాయని పోలీసులు తెలిపారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు.

Also Read: Minister KTR: వర్షాలు తగ్గడంతో కలెక్టర్లతో మంత్రి కేటీఆర్ టెలి కాన్ఫరెన్స్